జనసేన పార్టీ, రాష్ట్ర హైకోర్టులో అమరావతికి మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని విషయమై న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా, వివిధ రాజకీయ పార్టీల నుంచి అఫిడవిట్లను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అఫిడవిట్ బాధ్యతను పార్టీ ముఖ్య నేత శివశంకర్కి అప్పగించారు. పార్టీ ముఖ్య నేతలతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలనీ, రైతులు రాజధాని కోసం త్యాగం చేసిన దరిమిలా, వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లడానికి వీల్లేదని అఫిడవిట్లో పేర్కొన్నట్లు జనసేన నేత శివశంకర్ వెల్లడించారు. కాగా, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల అమరావతి రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు రైతులు. మొదటి నుంచీ అమరావతి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నది జనసేన పార్టీ మాత్రమే.
గతంలో టీడీపీతో కలిసి పనిచేసినా, ఆ సమయంలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు అండగా నిలబడ్డారు. అలా పవన్, రైతులకు మద్దతుగా నిలవడాన్ని టీడీపీ తీవ్రంగా ఆక్షేపించిన విషయం విదితమే. ఇప్పుడూ అమరావతి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో జనసేన వ్యవహరించడాన్ని ప్రస్తుత అధికార వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.
అప్పుడూ ఇప్పుడూ, రైతుల ప్రయోజనాల కోసమే జనసేన పార్టీ నినదించింది, నినదిస్తోందని ఆ పార్టీ నేతలంటున్నారు. ప్రత్యక్షంగా రాజధాని అమరావతి పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా, పార్టీ ముఖ్య నేతలు మద్దతిచ్చిన విషయం విదితమే. ఇదిలా వుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అఫిడవిట్ దాఖలు చేసింది. బీజేపీ, టీడీపీ, వైసీపీ కూడా ఈ విషయమై హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయాల్సి వుంది.
779639 292547Perfect just what I was searching for! . 600473
835253 831408Hello there! Nice post! Please inform us when all could see a follow up! 359809
182372 987981You completed various very good points there. I did a search on the theme and identified the majority of folks will consent with your weblog. 15994
158122 266067This really is often a wonderful weblog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 467654