టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసినవారిలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒకరు. అసెంబ్లీలోనూ, బయట జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా అచ్చెన్నాయుడు మాత్రం గెలుపొందారు. అనంతరం సభలో టీడీపీ తరఫున బలంగానే తన వాయిస్ వినిపించారు.
కానీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ తాజాగా అధికార పార్టీపై విమర్శలు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులు పెట్టిన టీడీపీ నేతలను బుక్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి మంచి అవకాశం దొరికింది.
గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు బయటపడింది. ఈఎస్ఐలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తేలింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన కొనగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ల్యాబ్ కిట్లు, టెలి హెల్త్ సర్వీసులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ లలో అవకతవకలు జరిగాయని తేల్చారు. టెండర్లు పిలవకుండానే నామినేషన్లపై మూడు సంస్థలకు పనులు అప్పగించినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
నామినేషన్లపై మూడు కంపెనీలకు ఆయా పనులు ఇవ్వాలని అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టు గుర్తించారు. దీంతో ఈ కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. తాను ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అలా వ్యవహరించినట్టు చెప్పారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో, అలాగే అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని పేర్కొన్నారు.
అవినీతి చేసే అవసరం తనకుగానీ, తన కుటుంబానికి గానీ లేదని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం అచ్చెన్నాయుడికి సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. కుంభకోణం జరిగిన విషయం మాత్రం వాస్తవం. దీని వెనుక కొంతమంది అధికారుల పాత్ర పక్కాగా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.
971736 163877Soon after study quite a few the websites on your own internet web site now, i truly like your means of blogging. I bookmarked it to my bookmark web site list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 166275