Switch to English

అచ్చెన్నాయుడు బుక్కయ్యారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసినవారిలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒకరు. అసెంబ్లీలోనూ, బయట జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా అచ్చెన్నాయుడు మాత్రం గెలుపొందారు. అనంతరం సభలో టీడీపీ తరఫున బలంగానే తన వాయిస్ వినిపించారు.

కానీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ తాజాగా అధికార పార్టీపై విమర్శలు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులు పెట్టిన టీడీపీ నేతలను బుక్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి మంచి అవకాశం దొరికింది.

గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు బయటపడింది. ఈఎస్ఐలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తేలింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన కొనగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ల్యాబ్ కిట్లు, టెలి హెల్త్ సర్వీసులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ లలో అవకతవకలు జరిగాయని తేల్చారు. టెండర్లు పిలవకుండానే నామినేషన్లపై మూడు సంస్థలకు పనులు అప్పగించినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

నామినేషన్లపై మూడు కంపెనీలకు ఆయా పనులు ఇవ్వాలని అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టు గుర్తించారు. దీంతో ఈ కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. తాను ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అలా వ్యవహరించినట్టు చెప్పారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో, అలాగే అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని పేర్కొన్నారు.

అవినీతి చేసే అవసరం తనకుగానీ, తన కుటుంబానికి గానీ లేదని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం అచ్చెన్నాయుడికి సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. కుంభకోణం జరిగిన విషయం మాత్రం వాస్తవం. దీని వెనుక కొంతమంది అధికారుల పాత్ర పక్కాగా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...