కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే బొగ్గు గనుల నుండి ఏపీకి రావాల్సిన బొగ్గు ను నిలుపుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే వరకు బొగ్గు సరఫరా నిలిపి వేస్తున్నట్లుగా ప్రకటించారు. బొగ్గు కంపెనీలకు చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయలు చెల్లిస్తే కొత్తగా మళ్లీ బొగ్గు నిల్వలు కావాల్సినంత ఇవ్వడం జరుగుతుంది. కాని అది మానేసి వేరే మార్గాలను అన్వేషించడం విడ్డూరంగా ఉంది.
రూ.250 కోట్ల రూపాయలను చెల్లిస్తే బొగ్గు కంపెనీలు బొగ్గును ఇస్తాయి. అదే కాని ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పెట్టి బయట నుండి బొగ్గును తీసుకు రావాలని భావిస్తున్నాయి. అందుకోసం చాలా చర్చలు జరుగుతున్నాయి. నిధులు లేక బొగ్గు కంపెనీలకు బకాయి పడ్డ ప్రభుత్వం ఇప్పుడు బయట నుండి భారీ ఎత్తున నిధులు చెల్లించి బొగ్గు సరఫరా చేయాలని భావించడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.