Switch to English

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి విజయాన్ని నమోదు చేశారా? తెలుగుదేశం పార్టీ వర్గాలు అలాగే సంబరపడుతున్నాయి. అయితే, అది కొంతవరకు గెలుపు లాంటిదే. కానీ, ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ దయా దాక్షిణ్యాలు సుస్పష్టం. ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌, మొత్తంగా తన క్యాబినెట్‌లోకి 25 మందిని తీసుకున్న తొలి రోజే, కేంద్రం నుంచి షాక్‌ తినాల్సి వచ్చింది.

మంత్రులు ఇలా పదవీ ప్రమాణ స్వీకారం చేశారో లేదో, అలా కేంద్రం నుంచి షాకింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌కి సంబంధించి, చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలు అన్యాయం, అక్రమం.. అంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ గగ్గోలు పెట్టడమే కాదు, ముఖ్యమంత్రి అయ్యాక, వాటన్నిటినీ సమీక్షించి.. పాత ఒప్పందాల్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు షురూ చేశారు.

అయితే, ఇక్కడే నరేంద్ర మోడీ సర్కార్‌, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ దూకుడుకి కళ్ళెం వేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు (పీపీఏలు) పారదర్శకంగా జరిగాయనీ, అందులో అక్రమాలకు అవకాశమే లేదనీ, కొత్త ప్రభుత్వం సమీక్షలు జరపడం వల్ల ఒప్పందాల స్ఫూర్తికి విఘాతం కలుగుతుందంటూ కేంద్ర నూతన, పునరుఆ్పదక ఇంధన వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి లేఖ రాయడం గమనార్హం. ఇది నిజంగానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి తొలి ఎదురు దెబ్బగా భావించాలి.

చంద్రబాబు హయాంలో అవినీతి అక్రమాలపై విచారణలు జరుపుతామంటూ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ చేస్తున్న హడావిడి, తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం కలకలం సృష్టించలేకపోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేకపోవచ్చు. నాలుగేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – టీడీపీ మిత్రపక్షాలుగా అధికారం పంచుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ నాలుగేళ్ళలో జరిగిన ఏ ఒప్పందం విషయంలో అయినా, ‘సహ దోషి’ అన్పించుకోవడానికి బీజేపీ ఇష్టపడదు. ఆ చిన్న లాజిక్‌ని వైఎస్‌ జగన్‌ ఎలా విస్మరించారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

అయినా, బీజేపీతో తెరవెనుక అంటకాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కాదని, చంద్రబాబుకి మోడీ సర్కార్‌ బాసటగా నిలవడం ఒకింత ఆశ్చర్యకరమే. రాజకీయాల్లో వన్‌ ప్లస్‌ వన్‌ అంటే అది రెండు కావొచ్చు, సున్నా కావొచ్చు, ఇంకేదన్నా కావొచ్చు. అదే మరి, రాజకీయం అంటే. ఇప్పుడిక, వైఎస్‌ జగన్‌ గత ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశాలపైనా సమీక్షలు, విచారణలు, చర్యల జోలికి వెళ్ళదనే అనుకోవచ్చా.? చిత్తశుద్ధితో న్యాయపోరాటం చేస్తామో, ఇంకోటనో వైఎస్‌ జగన్‌ చెబుతారా.? ఏమో, వేచి చూడాల్సిందే.

Related Posts

కులమే వారికి అడ్డొచ్చింది

జంపింగ్‌ జపాంగ్స్‌: జనసేనని ముంచేసింది వీళ్ళే

జగన్‌ ‘రెండున్నర’ ఫార్ములా.. నవ్వుల పాలవుతున్న వేళ

ఆ మీడియా సంస్థకు రూ.702 కోట్లిచ్చారా?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...