Switch to English

ఐదుగురు డిప్యూటీలు: ప్లస్సా.. మైనస్సా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొలువుతీరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొత్తం 25 మందితో ఒకేసారి జంబో కేబినెట్ ఏర్పాటు చేశారు. మంత్రిమండలిలో అన్ని వర్గాలూ, అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం ఉండేలా చాలా జాగ్రత్తగా తన సహచరులను ఎంపిక చేసుకున్నారు. కులాల ప్రాతిపదికన మంత్రిమండలి కూర్పు జరిపారు. సొంత సామాజిక వర్గానికి కేవలం 4 బెర్తులు మాత్రమే ఇచ్చిన జగన్.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

ఇక కాపు సామాజిక వర్గానికి సైతం నాలుగు పదవులు ఇచ్చారు. ఇలా సమతూకంతో జగన్ ఏర్పాటు చేసుకున్న కేబినెట్ పై దాదాపు అన్ని వర్గాల నుంచీ హర్షం వ్యక్తమవుతోంది. విమర్శలు చేయడానికి కూడా లేకుండా అత్యంత పరిణితితో మంత్రులను ఎంపిక చేసిన తీరు చూసి సీనియర్ రాజకీయ నాయకులు సైతం విస్తుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. కేబినెట్ కూర్పు బాగున్నప్పటికీ, ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇస్తానంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చెప్పి జగన్ సంచలన ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ వంటి కుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలనూ సంతృప్తిపరిచేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రితోపాటు ఒక డిప్యూటీ సీఎం ఉండటం సాధారణం. కొన్ని రాష్ట్రాల్లో అయితే డిప్యూటీ సీఎం అనే కాన్సెప్టే లేదు. ఇక ఏపీలోని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు పనిచేశారు.

కాపు సామాజికవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, బీసీ సామాజిక వర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వారివల్ల ఏమైనా సానుకూల ఫలితాలు కనిపించాయా? పాలనలో వారి ముద్ర ఏమైనా కనపడిందా? అంటే లేదనే చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రితోపాటు హోంశాఖ బాధ్యతలు చూసిన చినరాజప్ప ఏ విషయంలోనూ తన మార్కు చూపించలేకపోయారు. కనీసం ఓ పోలీస్ కానిస్టేబుల్ బదిలీ సైతం ఆయన చేతుల్లో ఉండదనే గుసగుసలు వినిపించేవి. ఇక రెవెన్యూశాఖ బాధ్యతలు చూసిన కేఈ అధికారాలు ఎంతవరకు చెల్లుబాటయ్యాయో అందరికీ తెలిసిందే.

సీఎం తర్వాత సీఎం అంతటి హోదా పేరుకే తప్ప.. పాలనకు మాత్రం ఆ హోదా అక్కరకు రాదనే సంగతి వీటిని చూస్తే అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటో.. ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఆయా సామాజికవర్గాలను సంతృప్తిపరచడానికి తప్ప.. ఇది కచ్చితంగా విఫల ప్రయోగమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రులకు సాధారణ మంత్రుల కంటే కొంచెం ఎక్కువ ప్రోటోకాల్, మరికొన్ని ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. అవి మినహా మరే ప్రయోజనం ఆ పోస్టుతో ఉండదని అంటున్నారు. ఇంతమంది డిప్యూటీ సీఎంలు ఉండటం వల్ల ఆ పోస్టుకు ఉండే ప్రాధాన్యత కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు.

Releated Posts

వైఎస్ జగన్ క్యాబినెట్: తండ్రి బాటలోనే తనయుడు..

వైఎస్‌ జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌: ఆంధ్రప్రదేశ్‌కి మరో ‘రెండు’!

ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...