ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొలువుతీరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొత్తం 25 మందితో ఒకేసారి జంబో కేబినెట్ ఏర్పాటు చేశారు. మంత్రిమండలిలో అన్ని వర్గాలూ, అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం ఉండేలా చాలా జాగ్రత్తగా తన సహచరులను ఎంపిక చేసుకున్నారు. కులాల ప్రాతిపదికన మంత్రిమండలి కూర్పు జరిపారు. సొంత సామాజిక వర్గానికి కేవలం 4 బెర్తులు మాత్రమే ఇచ్చిన జగన్.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
ఇక కాపు సామాజిక వర్గానికి సైతం నాలుగు పదవులు ఇచ్చారు. ఇలా సమతూకంతో జగన్ ఏర్పాటు చేసుకున్న కేబినెట్ పై దాదాపు అన్ని వర్గాల నుంచీ హర్షం వ్యక్తమవుతోంది. విమర్శలు చేయడానికి కూడా లేకుండా అత్యంత పరిణితితో మంత్రులను ఎంపిక చేసిన తీరు చూసి సీనియర్ రాజకీయ నాయకులు సైతం విస్తుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. కేబినెట్ కూర్పు బాగున్నప్పటికీ, ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇస్తానంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చెప్పి జగన్ సంచలన ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ వంటి కుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలనూ సంతృప్తిపరిచేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రితోపాటు ఒక డిప్యూటీ సీఎం ఉండటం సాధారణం. కొన్ని రాష్ట్రాల్లో అయితే డిప్యూటీ సీఎం అనే కాన్సెప్టే లేదు. ఇక ఏపీలోని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు పనిచేశారు.
కాపు సామాజికవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, బీసీ సామాజిక వర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వారివల్ల ఏమైనా సానుకూల ఫలితాలు కనిపించాయా? పాలనలో వారి ముద్ర ఏమైనా కనపడిందా? అంటే లేదనే చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రితోపాటు హోంశాఖ బాధ్యతలు చూసిన చినరాజప్ప ఏ విషయంలోనూ తన మార్కు చూపించలేకపోయారు. కనీసం ఓ పోలీస్ కానిస్టేబుల్ బదిలీ సైతం ఆయన చేతుల్లో ఉండదనే గుసగుసలు వినిపించేవి. ఇక రెవెన్యూశాఖ బాధ్యతలు చూసిన కేఈ అధికారాలు ఎంతవరకు చెల్లుబాటయ్యాయో అందరికీ తెలిసిందే.
సీఎం తర్వాత సీఎం అంతటి హోదా పేరుకే తప్ప.. పాలనకు మాత్రం ఆ హోదా అక్కరకు రాదనే సంగతి వీటిని చూస్తే అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటో.. ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఆయా సామాజికవర్గాలను సంతృప్తిపరచడానికి తప్ప.. ఇది కచ్చితంగా విఫల ప్రయోగమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రులకు సాధారణ మంత్రుల కంటే కొంచెం ఎక్కువ ప్రోటోకాల్, మరికొన్ని ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. అవి మినహా మరే ప్రయోజనం ఆ పోస్టుతో ఉండదని అంటున్నారు. ఇంతమంది డిప్యూటీ సీఎంలు ఉండటం వల్ల ఆ పోస్టుకు ఉండే ప్రాధాన్యత కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు.
Releated Posts
వైఎస్ జగన్ క్యాబినెట్: తండ్రి బాటలోనే తనయుడు..
వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: ఆంధ్రప్రదేశ్కి మరో ‘రెండు’!
ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం
624766 402117Very well written story. It will be beneficial to everybody who utilizes it, as properly as myself. Maintain up the very good work – i will undoubtedly read far more posts. 370419
162989 960086Wow, fantastic weblog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall appear of your internet website is amazing, let alone the content material! 112168
171217 986470I want to thank you for the superb post!! I certainly liked every bit of it. Ive bookmarked your web site so I can take a appear at the latest articles you post later on. 550164
746144 456894I enjoy your wp format, where did you get a hold of it? 753922