ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ లో వైఎస్సార్ సీపీ తనకు ఎదురేలేకుండా దూసుకుపోతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. టీడీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు జడ్పీటీసీల్లో వైసీపీ విజయం మూడంకెలు దాటగా.. ప్రతిపక్ష టీడీపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం గమనార్హం.
టీడీపీకి కంచుకోటలుగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా టీడీపీ ప్రభావం చూపలేకపోతోంది. కృష్ణాలో ఒక్క జడ్పీటీసీని కూడా టీడీపీ చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం జడ్పీటీసీల్లో వైసీపీ దూసుకుపోతోంది. కడపలో 38, చిత్తూరులో 30, కర్నూలులో 16, నెల్లూరులో 12, ప్రకాశంలో 14, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 1 స్థానాల్లో వైసీపీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. మిగిలిన జిల్లాల్లో ఫలితాలు అందాల్సి ఉంది. ఎక్కడా కూడా టీడీపీకి ఆధిపత్యం వచ్చిన దాఖలాలు లేకపోవడం విశేషం.
249261 706705you can have an ideal blog right here! would you prefer to make some invite posts on my weblog? 542980