Switch to English

కేసీఆర్‌కి కాస్త తీరిగ్గా తెల్లారిందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షా ఫలితాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై బెంగతో గగ్గోలు పెడుతోంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరిగ్గా సమీక్ష నిర్వహించి, కొన్ని ఉపశమనాలైతే ప్రకటించారు. పరీక్ష ఫెయిల్‌ అయినవారికి రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ఉచితంగా చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కాస్త ఊరట చెందుతున్నారు.

మొత్తం 19 మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్షా ఫలితాల గందరగోళం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన కేసీఆర్‌, విచారం కూడా వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నమూ చేశారు. వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ప్రక్రియలు చేపట్టి, పోటీ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా చేయాలని కేసీఆర్‌ సూచించడం పట్ల చాలామంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకాస్త ముందుగా స్పందించి వుంటే, విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. నిజానికి తొలుత అసలు లోపాలే జరగలేదని ఇంటర్మీడియట్‌ బోర్డు బుకాయించింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా విద్యా శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, తప్పులే దొర్లలేదనీ.. చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతంగా చూపిస్తున్నారనీ మీడియాపై మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్‌ చేసిన ‘గ్లోబరీనా’ సంస్థ కూడా తప్పులేం జరగలేదనే బుకాయించడం చూశాం.

తాజాగా ఈ రోజు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో విషయం మరింత వివాదాస్పదమయ్యేసరికి, కేసీఆర్‌ స్పందించాల్సి వచ్చిందని భావించాలేమో. పొరుగు రాష్ట్రాల్లోనూ, అవసరమైతే పొరుగు దేశాల్లోనూ పరీక్షల నిర్వహణపై పరిశీలన చేయాలనీ, అవసరమైతే ఆ సాంకేతికతను తెలంగాణలోనూ వినియోగించాలని కేసీఆర్‌ సూచించడాన్ని అభినందించాల్సిందే. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా మీడియాలో ఫోకస్‌ అయ్యిందంతే. ఇప్పటిదాకా ఈ విషయంలో ప్రభుత్వమెందుకు చొరవ చూపించలేదన్నది చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న.

ఇదిలా వుంటే, పాస్‌ అయిన విద్యార్థుల్లోనూ కొందరు ‘లక్కు కొద్దీ’ అదనపు మార్కులు పొందారనీ, ఇందులోనూ చాలా తప్పిదాలు జరిగాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి సున్నా మార్కులేసిన ఘనులు, సున్నా మార్కులొచ్చిన విద్యార్థికి 99 మార్కులు వేయలేదని ఎలా అనుకోగలం? తనకు 27 మార్కులు వస్తే ఫెయిల్‌ అని రాశారనీ, 17 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి పాస్‌ అని పేర్కొన్నారని ఓ విద్యార్థి చెబుతున్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

ఎలా చూసినా, ఈసారి ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వాహణ చాలా అధ్వాన్నంగా జరిగిందనే విషయం అర్థమవుతోంది. అధికారులు, గ్లోబరీనా సంస్థ మాత్రమే కాదు, అధికారంలో వున్నవారు కూడా ఈ తప్పిదానికి బాధ్యత వహించి తీరాల్సిందే. అన్నిటికీ మించి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తంగా 19 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు బాధ్యత వహించి తీరాలనే వాదన విపక్షాల నుంచి వ్యక్తమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...