Switch to English

కేసీఆర్‌కి కాస్త తీరిగ్గా తెల్లారిందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షా ఫలితాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై బెంగతో గగ్గోలు పెడుతోంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరిగ్గా సమీక్ష నిర్వహించి, కొన్ని ఉపశమనాలైతే ప్రకటించారు. పరీక్ష ఫెయిల్‌ అయినవారికి రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ఉచితంగా చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కాస్త ఊరట చెందుతున్నారు.

మొత్తం 19 మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్షా ఫలితాల గందరగోళం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన కేసీఆర్‌, విచారం కూడా వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నమూ చేశారు. వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌, రీ-వాల్యూయేషన్‌ ప్రక్రియలు చేపట్టి, పోటీ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా చేయాలని కేసీఆర్‌ సూచించడం పట్ల చాలామంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకాస్త ముందుగా స్పందించి వుంటే, విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. నిజానికి తొలుత అసలు లోపాలే జరగలేదని ఇంటర్మీడియట్‌ బోర్డు బుకాయించింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా విద్యా శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, తప్పులే దొర్లలేదనీ.. చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతంగా చూపిస్తున్నారనీ మీడియాపై మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్‌ చేసిన ‘గ్లోబరీనా’ సంస్థ కూడా తప్పులేం జరగలేదనే బుకాయించడం చూశాం.

తాజాగా ఈ రోజు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో విషయం మరింత వివాదాస్పదమయ్యేసరికి, కేసీఆర్‌ స్పందించాల్సి వచ్చిందని భావించాలేమో. పొరుగు రాష్ట్రాల్లోనూ, అవసరమైతే పొరుగు దేశాల్లోనూ పరీక్షల నిర్వహణపై పరిశీలన చేయాలనీ, అవసరమైతే ఆ సాంకేతికతను తెలంగాణలోనూ వినియోగించాలని కేసీఆర్‌ సూచించడాన్ని అభినందించాల్సిందే. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా మీడియాలో ఫోకస్‌ అయ్యిందంతే. ఇప్పటిదాకా ఈ విషయంలో ప్రభుత్వమెందుకు చొరవ చూపించలేదన్నది చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న.

ఇదిలా వుంటే, పాస్‌ అయిన విద్యార్థుల్లోనూ కొందరు ‘లక్కు కొద్దీ’ అదనపు మార్కులు పొందారనీ, ఇందులోనూ చాలా తప్పిదాలు జరిగాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి సున్నా మార్కులేసిన ఘనులు, సున్నా మార్కులొచ్చిన విద్యార్థికి 99 మార్కులు వేయలేదని ఎలా అనుకోగలం? తనకు 27 మార్కులు వస్తే ఫెయిల్‌ అని రాశారనీ, 17 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి పాస్‌ అని పేర్కొన్నారని ఓ విద్యార్థి చెబుతున్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

ఎలా చూసినా, ఈసారి ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వాహణ చాలా అధ్వాన్నంగా జరిగిందనే విషయం అర్థమవుతోంది. అధికారులు, గ్లోబరీనా సంస్థ మాత్రమే కాదు, అధికారంలో వున్నవారు కూడా ఈ తప్పిదానికి బాధ్యత వహించి తీరాల్సిందే. అన్నిటికీ మించి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తంగా 19 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు బాధ్యత వహించి తీరాలనే వాదన విపక్షాల నుంచి వ్యక్తమవుతోంది.

6 COMMENTS

సినిమా

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

సాక్షిపై న్యాయ పోరాటం నుంచి ఎకనామిక్ విజన్ వరకు: లోకేష్ స్పష్టీకరణ

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

సంక్రాంతి సంబరాలతో పిఠాపురంలో మూడు రోజుల పర్యటనకు పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకునే ఆయన, 9వ తేదీన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ పేరిట...