ముందస్తు కొనుగోళ్ళకు తెరలేపుతున్న టీడీపీ, వైసీపీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగిన పోలింగ్‌ తాలూకు ఫలితాలు ఇంకో నెల రోజుల్లో వెల్లడి కానున్నాయి. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఈలోగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘గెలిచేది మేమే’ అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం చూస్తున్నాం. ఓటరు తన తీర్పుని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నమోదు చేసిన తర్వాత, ఆ ఫలితమేంటో తెలియకుండానే ఆయా పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం హాస్యాస్పదం.

ఎవరి అంచనాలు వారికి వుండడం తప్పు కాదు. కానీ, ఆ అంచనాల పేరుతో ప్రత్యర్థుల్ని చులకన చేయడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే అవుతుంది. జనసేన ప్రభావంపై తెలుగుదేశం పార్టీకి కొంత బెంగ వున్న మాట వాస్తవం. ఆ బెంగతోనే కొంచెం ఆచి తూచి స్పందిస్తోంది టీడీపీ, జనసేన విషయంలో. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి వేరు. జనసేనను చాలా చులకనగా చూస్తోంది జగన్‌ పార్టీ. జనసేనను మాత్రమే కాదు, టీడీపీ విషయంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరు ఇలాగే వుంది.

2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యుత్సాహం ఇలాగే కనిపించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక, ‘తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయాం..’ అంటూ తమ ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటూ ప్రధానంగా జనసేన మీద అక్కసు ప్రదర్శించడం చూశాం. బహుశా, ఈసారి ఎన్నికల ఫలితాలు కూడా తమను వెక్కిరిస్తే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడేది జనసేన మీదనే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కాదు, జనసేన మాత్రమే అన్నట్లున్నాయి రాజకీయ సమీకరణాలు.

ఇదిలా వుంటే, అదికార తెలుగుదేశం పార్టీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెలిచే అభ్యర్థులెవరన్నదానిపై ఆరా తీసి, వారికి గాలం వేసే పనిలో బిజీగా వుందన్న వార్త ఒకటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఫలితాల వెల్లడికి రెండ్రోజుల ముందే తమ పార్టీ అభ్యర్థుల్ని అమరావతికి రావాలంటూ ‘క్యాంపు రాజకీయాలకు’ సన్నాహాలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్యాంపులో టీడీపీ అభ్యర్థులే కాదు, కొందరు వైసీపీ అభ్యర్థులు కూడా వుండబోతున్నారని సమాచారమ్‌.

మొన్నటివరకూ టీడీపీలో వుండి, చివరి నిమిషంలో వైసీపీలోకి చేరి, ఆ పార్టీ జెండాతో పోటీ చేసిన 15 నుంచి 20 మంది అభ్యర్థుల వరకు టీడీపీ నిర్వహించబోయే అమరావతి క్యాంపులో దర్శనమిస్తారట. అదే గనుక జరిగితే, అంతకు మించిన స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ‘క్యాంపు’ ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అయితే వైసీపీ ‘క్యాంపు’ హైద్రాబాద్‌లో వుంటుందని ఆఫ్‌ ది రికార్డ్‌గా వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

‘క్యాంపు’ అంటే కొనుగోళ్ళ సంత అని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? కర్నాటక, తమిళనాడుల్లో ఇలాంటి ‘క్యాంపుల్ని’ ఎక్కువగా చూస్తుంటాం. అప్పుడప్పుడూ తెలుగు రాజకీయాల్లోనూ ఈ క్యాంపుల నిర్వహణలు మామూలే. నేతల్ని కోట్లు వెచ్చించి ఖర్చు చేసి, వారిని తమ వెంట తిప్పుకోవడమే ఈ క్యాంపుల లక్ష్యం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జనసేన పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులకు కూడా టీడీపీ, వైసీపీ గాలం వేస్తున్నాయట తమ తమ క్యాంపుల్లోకి లాగడానికి.

ఎన్నికల తర్వాత క్యాంపుల్ని చూశాంగానీ, ఎన్నికలకు ముందర ఈ క్యాంపుల ఏర్పాట్లు ఏంటని తలపండిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఎలాగూ మళ్ళీ మలి దఫా కొనుగోళ్ళ వ్యవహారముంటుందనీ, ఈలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కొనుగోళ్ళు తప్పకపోవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

7 COMMENTS

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

“యుద్ధానికి సన్నద్ధం… హార్ముజ్‌లో దిగ్బంధం” : Donald Trump తాజా హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump తాజాగా యుద్ధ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇరాన్‌తో జరిగిన...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి Sree Harsha...

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...