Switch to English

రఘురామ‘బాణం’: జగన్‌.. సాక్షిని కాదు, మనస్సాక్షిని నమ్మాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ ఎంపీల బృందం, ప్రత్యేక విమానం వేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళి లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా, పార్టీ నుంచి ఆయన్ని ఇప్పటిదాకా వైసీపీ అధిష్టానం సస్పెండ్‌ చేయలేకపోయింది. పార్టీ వీక్‌నెస్‌ ఏంటో బాగా తెలిసిన రఘురామకృష్ణరాజు, వీలు చిక్కినప్పుడల్లా తనదైన స్టయిల్లో ‘అస్త్రాల్ని’ సంధిస్తున్నారు సొంత పార్టీ మీద. దాదాపుగా ప్రతిరోజూ ఆయన ఢిల్లీలో ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

తాజాగా ప్రెస్‌మీట్‌లో అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద ఎడా పెడా అస్త్రాలు సంధించేశారు. ‘ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కదా.. ఇప్పుడు అమరావతి విషయంలోనూ రైతుల కోసం ఓదార్పు యాత్ర చేయాలి.. అమరావతి కోసం పలువురు ప్రాణాలు కోల్పోయారు.. వారి కుటుంబాల్ని పరామర్శించి, ఓదార్చండి.. మీకు మంచి పేరు వస్తుంది..’ అని ఉచిత సలహా ఇచ్చారు రఘురామకృష్ణరాజు.

అంతేనా, ‘సాక్షిని నమ్మకండి.. మనస్సాక్షిని నమ్మండి.. ఏడాదిలో పెన్షన్‌ని మరో 250 రూపాయలు పెంచుతామని గతంలో చెప్పారు.. కానీ, ఈ నెల నుంచి పెంచలేకపోయారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మరి, వేల కోట్లు ఖర్చు చేసి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు.?’ అంటూ జగన్‌ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు రఘురామకృష్ణరాజు.

‘మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో అసలు అర్థమే లేదు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేస్తున్నారు. దానికి మూడు రాజధానుల ముసుగేశారంతే..’ అని తేల్చేసిన రఘురామకృష్ణరాజు, రాజధాని మహిళా రైతులు తలచుకుంటే, తరలింపు ఆగిపోతుందనీ, న్యాయపోరాటంలో మహిళలు తెగువ చూపాలనీ, వారికి తమందరి మద్దతు వుంటుందని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత అనడం సబబు కాదంటున్న రఘురామకృష్ణరాజు, పదవుల్లో వుంటూనే పోరాటం చేయాల్సి వుంటుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తన రాజీనామాని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో, ‘నన్ను రాజీనామా చేయమని మా పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.. నేను రెడీ.. కానీ, మూడు రాజధానుల డిమాండ్‌తో మళ్ళీ ఎన్నికలకు మొత్తంగా అందరం వెళదామా.?’ అని సవాల్‌ విసిరారు.

కనీసం విశాఖలో అయినా మూడు రాజధానుల డిమాండ్‌తో ఉప ఎన్నికలకు వెళ్ళే దైర్యముందా.? అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు రఘురామకృష్ణరాజు. అన్నట్టు, సన్నబియ్యం విషయంలో ‘సాక్షి తప్పు రాసింది అధ్యక్షా..’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ ఒప్పుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఆయనే ‘సాక్షి’ విశ్వసనీయత ఎంతో తేల్చేశారు. ఇక, రాష్ట్రంలో శానిటైజర్‌ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు, కరోనా మరణాల్ని మించిపోయేలా వున్నాయని రఘురామకృష్ణరాజు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారండోయ్‌.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....