Switch to English

రఘురామ‘బాణం’: జగన్‌.. సాక్షిని కాదు, మనస్సాక్షిని నమ్మాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ ఎంపీల బృందం, ప్రత్యేక విమానం వేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళి లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా, పార్టీ నుంచి ఆయన్ని ఇప్పటిదాకా వైసీపీ అధిష్టానం సస్పెండ్‌ చేయలేకపోయింది. పార్టీ వీక్‌నెస్‌ ఏంటో బాగా తెలిసిన రఘురామకృష్ణరాజు, వీలు చిక్కినప్పుడల్లా తనదైన స్టయిల్లో ‘అస్త్రాల్ని’ సంధిస్తున్నారు సొంత పార్టీ మీద. దాదాపుగా ప్రతిరోజూ ఆయన ఢిల్లీలో ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

తాజాగా ప్రెస్‌మీట్‌లో అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద ఎడా పెడా అస్త్రాలు సంధించేశారు. ‘ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కదా.. ఇప్పుడు అమరావతి విషయంలోనూ రైతుల కోసం ఓదార్పు యాత్ర చేయాలి.. అమరావతి కోసం పలువురు ప్రాణాలు కోల్పోయారు.. వారి కుటుంబాల్ని పరామర్శించి, ఓదార్చండి.. మీకు మంచి పేరు వస్తుంది..’ అని ఉచిత సలహా ఇచ్చారు రఘురామకృష్ణరాజు.

అంతేనా, ‘సాక్షిని నమ్మకండి.. మనస్సాక్షిని నమ్మండి.. ఏడాదిలో పెన్షన్‌ని మరో 250 రూపాయలు పెంచుతామని గతంలో చెప్పారు.. కానీ, ఈ నెల నుంచి పెంచలేకపోయారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మరి, వేల కోట్లు ఖర్చు చేసి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు.?’ అంటూ జగన్‌ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు రఘురామకృష్ణరాజు.

‘మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో అసలు అర్థమే లేదు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేస్తున్నారు. దానికి మూడు రాజధానుల ముసుగేశారంతే..’ అని తేల్చేసిన రఘురామకృష్ణరాజు, రాజధాని మహిళా రైతులు తలచుకుంటే, తరలింపు ఆగిపోతుందనీ, న్యాయపోరాటంలో మహిళలు తెగువ చూపాలనీ, వారికి తమందరి మద్దతు వుంటుందని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత అనడం సబబు కాదంటున్న రఘురామకృష్ణరాజు, పదవుల్లో వుంటూనే పోరాటం చేయాల్సి వుంటుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తన రాజీనామాని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో, ‘నన్ను రాజీనామా చేయమని మా పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.. నేను రెడీ.. కానీ, మూడు రాజధానుల డిమాండ్‌తో మళ్ళీ ఎన్నికలకు మొత్తంగా అందరం వెళదామా.?’ అని సవాల్‌ విసిరారు.

కనీసం విశాఖలో అయినా మూడు రాజధానుల డిమాండ్‌తో ఉప ఎన్నికలకు వెళ్ళే దైర్యముందా.? అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు రఘురామకృష్ణరాజు. అన్నట్టు, సన్నబియ్యం విషయంలో ‘సాక్షి తప్పు రాసింది అధ్యక్షా..’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ ఒప్పుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఆయనే ‘సాక్షి’ విశ్వసనీయత ఎంతో తేల్చేశారు. ఇక, రాష్ట్రంలో శానిటైజర్‌ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు, కరోనా మరణాల్ని మించిపోయేలా వున్నాయని రఘురామకృష్ణరాజు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారండోయ్‌.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...