నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ ఎంపీల బృందం, ప్రత్యేక విమానం వేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళి లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేసినా, పార్టీ నుంచి ఆయన్ని ఇప్పటిదాకా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయలేకపోయింది. పార్టీ వీక్నెస్ ఏంటో బాగా తెలిసిన రఘురామకృష్ణరాజు, వీలు చిక్కినప్పుడల్లా తనదైన స్టయిల్లో ‘అస్త్రాల్ని’ సంధిస్తున్నారు సొంత పార్టీ మీద. దాదాపుగా ప్రతిరోజూ ఆయన ఢిల్లీలో ప్రెస్మీట్లు పెడుతున్నారు.
తాజాగా ప్రెస్మీట్లో అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఎడా పెడా అస్త్రాలు సంధించేశారు. ‘ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కదా.. ఇప్పుడు అమరావతి విషయంలోనూ రైతుల కోసం ఓదార్పు యాత్ర చేయాలి.. అమరావతి కోసం పలువురు ప్రాణాలు కోల్పోయారు.. వారి కుటుంబాల్ని పరామర్శించి, ఓదార్చండి.. మీకు మంచి పేరు వస్తుంది..’ అని ఉచిత సలహా ఇచ్చారు రఘురామకృష్ణరాజు.
అంతేనా, ‘సాక్షిని నమ్మకండి.. మనస్సాక్షిని నమ్మండి.. ఏడాదిలో పెన్షన్ని మరో 250 రూపాయలు పెంచుతామని గతంలో చెప్పారు.. కానీ, ఈ నెల నుంచి పెంచలేకపోయారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మరి, వేల కోట్లు ఖర్చు చేసి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు.?’ అంటూ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు రఘురామకృష్ణరాజు.
‘మూడు రాజధానుల కాన్సెప్ట్లో అసలు అర్థమే లేదు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేస్తున్నారు. దానికి మూడు రాజధానుల ముసుగేశారంతే..’ అని తేల్చేసిన రఘురామకృష్ణరాజు, రాజధాని మహిళా రైతులు తలచుకుంటే, తరలింపు ఆగిపోతుందనీ, న్యాయపోరాటంలో మహిళలు తెగువ చూపాలనీ, వారికి తమందరి మద్దతు వుంటుందని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత అనడం సబబు కాదంటున్న రఘురామకృష్ణరాజు, పదవుల్లో వుంటూనే పోరాటం చేయాల్సి వుంటుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన రాజీనామాని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో, ‘నన్ను రాజీనామా చేయమని మా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.. నేను రెడీ.. కానీ, మూడు రాజధానుల డిమాండ్తో మళ్ళీ ఎన్నికలకు మొత్తంగా అందరం వెళదామా.?’ అని సవాల్ విసిరారు.
కనీసం విశాఖలో అయినా మూడు రాజధానుల డిమాండ్తో ఉప ఎన్నికలకు వెళ్ళే దైర్యముందా.? అని వైఎస్ జగన్ మోహన్రెడ్డికి సవాల్ విసిరారు రఘురామకృష్ణరాజు. అన్నట్టు, సన్నబియ్యం విషయంలో ‘సాక్షి తప్పు రాసింది అధ్యక్షా..’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఆయనే ‘సాక్షి’ విశ్వసనీయత ఎంతో తేల్చేశారు. ఇక, రాష్ట్రంలో శానిటైజర్ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు, కరోనా మరణాల్ని మించిపోయేలా వున్నాయని రఘురామకృష్ణరాజు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారండోయ్.
897829 776455Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance simple. The total appear of your web internet site is outstanding, neatly as the content material! 57341
206785 289490Most what i read online is trash and copy paste but i believe you offer something different. Keep it like this. 463443
313108 700577I discovered your weblog website website on the search engines and check several of your early posts. Always preserve up the quite excellent operate. I lately additional increase Rss to my MSN News Reader. Seeking for toward reading significantly more on your part later on! 550724
168818 82638This is one quite intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 97996