సుశాంత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు ముంబయి పోలీసులు ఈ కేసును చాలా లైట్గా తీసుకుని ఎంక్వౌరీ చేశారు. ఎప్పుడు అయితే ఈ కేసులో బీహార్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో అప్పటి నుండి మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పాట్నా పోలీసులు కాస్త లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. దాంతో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాట్నా పోలీసులు గత వారం రోజులుగా రియా చక్రవర్తిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని ఆమె మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. ఆమె ఫోన్ మరియు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్స్ అన్ని కూడా ఆఫ్ ఉన్నాయి. వారు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా లేదు. ఒక జాతీయ మీడియా సంస్థ రియా చక్రవర్తి ఇంటి వాచ్మెన్ను ప్రశ్నించగా ఒక రాత్రి సమయంలో రియా మేడమ్ వారి అమ్మానాన్న పెద్ద సూట్ కేజ్ తో బ్లూ కలర్ కారులో వెళ్లిపోయారు. అప్పటి నుండి తిరిగి రాలేదని అన్నాడు.
వాచ్ మన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పాట్నా పోలీసులు విచారించే అవకాశం ఉందనే అనుమానంతోనే రియా ఫ్యామిలీ జంప్ అయ్యి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియా తరపున ఇప్పటికే ఆమె లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ముంబయి పోలీసుల పరిధిలోకి ఈ కేసు తీసుకు రావాలని పాట్నా పోలీసులు ఈ కేసును వదిలేసేలా ఆదేశించాలంటూ సుప్రీంలో ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రియా పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
290671 873956Some really quality posts on this site , saved to favorites . 313026
717711 992280Its actually a cool and beneficial piece of data. Im glad that you shared this valuable information with us. Please maintain us informed like this. Thanks for sharing. 931865