Switch to English

నిమ్మగడ్డ రీ-ఎంట్రీ: ‘రాగద్వేషాలకతీతంగా పనిచేస్తానంటున్న ఎస్‌ఈసీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ ఆగ్రహానికి గురైన నిమ్మగడ్డ, ఎస్‌ఈసీ పదవిని కోల్పోయిన విషయం విదితమే. నిమ్మగడ్డపై ‘కులం’ పేరుతో ఆరోపణలు చేసిన జగన్‌ సర్కార్‌, ఎన్నికల సంస్కరణలంటూ.. ఆయన్ని తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్‌ నేపథ్యంలో కనగరాజ్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు కూడా. అయితే, హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్‌ వేయడంతో.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మొట్టికాయలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డిరెన్స్‌ని హైకోర్టు కొట్టిపారేసింది.

అయితే, నిమ్మగడ్డకు తిరిగి ఎస్‌ఈసీ పదవి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుముఖత వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈలోగా కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ నిమ్మగడ్డ మరోమారు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ‘ఊరట’ దక్కకపోగా, నిమ్మగడ్డకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. రాష్ట్ర గవర్నర్‌ని కలవాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచించడం, గవర్నర్‌ని నిమ్మగడ్డ కలవడం, నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించడంతో ‘సుప్రీం కోర్టు తుది తీర్పుకి లోబడి నియామకం..’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగాయి.

ఇక, ఈ రోజు విధుల్లో చేరిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వం మునుపటిలానే ఎన్నికల సంఘానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాను..’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కన్పించడంలేదు. ఇదిలా వుంటే, నిమ్మగడ్డ తిరిగి పదవిలోకి వస్తే, కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాని వదిలేస్తామన్నారు.. ఓ మంత్రిగారైతే, ‘జుగుప్సాకరమైన వ్యాఖ్యలు’ చేశారు.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ కూడా నిమ్మగడ్డపై నోరు పారేసుకున్న విషయం విదితమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...