కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాల్ని హరించడమే కాదు.. వారిలో సాటి మనిషిని చూస్తే భయం పుట్టే పరిస్థితులు కల్పించింది. ఇటువంటి పరిస్థితిని ఉదహరించే సంఘటన హైదరాబాద్ లోని ఏఎస్ రావ్ నగర్లో జరిగింది. నడిరోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలిపోతే ఎవ్వరూ దగ్గరు చేరుకుని స్పందించకపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.
శామీర్ పేటకు చెందిన పృథ్వీరాజ్ మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. అతడిని కుటుంబసభ్యులు బుధవారం ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బయట ఆటో కోసం రోడ్డపై వేచి చూస్తూండగా పరిస్థితి విషమించి అక్కడికక్కడే కూప్పకూలిపోయాడు. ప్రస్తుత కరోనా భయంకర పరిస్థితుల్లో ఎవరూ ఆ యువకుడి వద్దకు వెళ్లేందుకు సాహసించ లేదు.
కొందరు 108కి సమాచారం అందించడంతో అక్కడికొచ్చిన సిబ్బంది పరిక్షించగా అప్పటికే ఆ యువకుడు మరిణించినట్టు తెలిపారు. దీంతో ఆ యువకుడితోపాటు అక్కడే ఉన్న అతని తల్లి, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయంతో తాము ఎంత అర్ధించినా ఎవరూ ముందుకు రాలేదని పృథ్వీరాజ్ కుటుంబసభ్యులు వాపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
538799 748375Sewing Machines […]any time to read or go to the content or perhaps internet internet sites we undoubtedly have associated with[…] 994240
591689 588739Superb read, I just passed this onto a friend who was performing some research on that. And he actually bought me lunch since I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 66697
979695 105256I believe so. I think your post will give those folks a very good reminding. And they will express thanks to you later 975909