రాజీవ్ ట్రస్ట్, ఇందిరా ట్రస్టుల్లో ఆర్ధిక అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ దర్యాప్తును ఈడీ స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సీబీఐ కూడ భాగం కానుంది. ఈమేరకు హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ గురించి ఆశాఖ ప్రతినిధి వివరించారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మొమోరియల్ ట్రస్ట్ లకు వచ్చే నిధులు విషయంలో నిధులు దారి మళ్లింపు, పన్ను ఎగవేశారనేది ప్రధాన ఆరోపణలు. ఈ మూడింటిక సోనియా గాంధీనే చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా అప్పటి పీఎం మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, చిదంబరం ట్రస్టీలుగా వ్యవహరించారు.
ఇటివల భారత్, చైనా సరిహద్దు వివాదంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలసిందే. ఇందులో భాగంగా కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధులకు చైనా నుంచి నిధులు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. సరిహద్దు విషయంలో చైనాకు మోదీ సరెండర్ అయిపోయారని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబాలకు చెందని ట్రస్టులకు చైనా నుంచి నిధులు అందుతున్నాయని బీజేపీ ఆరోపించింది.
యూపిఏ హయాంలో పీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు తరలించారని ఆరోపించింది. ఇరుపార్టీల ప్రత్యారోపణల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్టులపై విచారణకు కేంద్రం కమిటీ వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
267390 462684A quite quite fascinating post! Ill try to track that continues here! Thank you. 277810