ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం ఈ సమయంలో మంచిది అంటూ జొన్నవిత్తుల రాసిన పద్యం కరోనాను ఉద్దేశించింది. కాని కొందరు మాత్రం దాన్ని తప్పుడు అర్థం వెదికే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జొన్నవిత్తుల తరపు న్యాయవాది అంటున్నాడు. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఈ విషయమై జొన్నవిత్తులపై కేసు పెట్టాడు.
కరోనా నేపథ్యంలో ఇటీవల జొన్న విత్తుల ఒక పద్యంను రాయడం జరిగింది. అందులో ఒకరి నుండి ఒకరు దూరంగా ఉండాలంటూ సూచించాడు. భౌతిక దూరం పాటించేందుకు ప్రతి ఒక్కరు మడి కట్టుకుని ఉండాల్సిందే అని, వారిని తాకడం వల్ల జీవితం దుర్బరంగా మారుతుందని ఆయన తన పద్యంలో పేర్కొన్నాడు. ఈ విషయంలో జొన్నవిత్తుల అంటరాని తనంను సమర్ధించినట్లుగా బత్తుల రాంప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఉన్నత జాతికి చెందిన వ్యక్తిగా తన పెద్దరికంను చాటుకునేందుకు తన పద్యంలో ఆ పదంను చేర్చాడు అంటూ బత్తుల కేసులో పేర్కొన్నాడు.
తన జాతి గొప్పది, తన కులమే ఉన్నతమైనది అనే అర్థం వచ్చేలా సోషల్ డిస్టెన్స్ పేరుతో తక్కువ జాతి వారిపై విషం వెళ్లగక్కాడు అంటూ బత్తుల పేర్కొన్నాడు. ఈ విషయమై జొన్నవిత్తుల స్పందిస్తూ.. మరణసయ్యపై మడికట్టుకుని ఉంది మానవజాతి. మడి కట్టుకోవడం అంటే ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలని అర్థం. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కొందరు విమర్శలు చేస్తున్నారని, తాను కోర్టులో తేల్చుకుంటాను అంటూ జొన్నవిత్తుల సన్నిహితుల వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు.
346556 7924When I came over to this post I can only appear at part of it, is this my net browser or the internet web site? Really should I reboot? 660776
682783 302905I visited a great deal of web site but I believe this one contains something extra in it in it 730816