ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ దారుణాల్ని మీడియా సాక్షిగా తిలకించాం. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం వుందా.? లేదా.? అన్న అనుమానం అందరికీ కలిగింది. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది కూడా. చివరికి కరోనా కారణంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ కొంత జరిగాక వాయిదా పడాల్సి వచ్చింది. మరోపక్క, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. దాన్ని హైకోర్టు తాజాగా రద్దు చేసింది కూడా.
ఇక, ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశట్టిె సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఓ లేఖ రాశారు. జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ హోదాలో ఆయన ఈ లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి రాయడంతో.. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చిత్తూరు, కడప జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించిన దరిమిలా, ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల్ని సవివరంగా తన లేఖలో పేర్కొన్నారు బొలిశట్టిె సత్యనారాయణ. మొత్తంగా జరిగిన ఏకగ్రీవాల్ని రద్దు చేయాలనీ, అక్కడసలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే పరిస్థితే లేదనీ, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనీ, దాడులకు దిగారనీ బొలిశట్టిె సత్యనారాయణ, ఎస్ఇసికి రాసిన లేఖలో ప్రస్తావించారు.
అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి, రాజకీయ గూండాల్ని నిలువరించి కొత్తగా ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు బొలిశట్టిె. మహిళలపైనా, వృద్ధులపైనా అధికార పార్టీ నేతలు దాడులు చేయడం వంటి హేయమైన చర్యలు స్థానిక ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న దరిమిలా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కొత్తగా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారా.? లేదంటే ఎక్కడైతే ఆగిపోయిందే అక్కడినుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే.
651011 309372I like your writing style truly loving this web site . 680545