మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.
వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ టీవీ చానెల్ లో ద ఏఎమ్ షో కోసం లైవ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్ లో భూకంపం సంభవించింది. కానీ.. ఆ అలికిడికి ఆమె ఏమాత్రం బెదరలేదు. లైవ్ ఇంటర్వ్యూ కొనసాగించారు. ఆమె ఇంటర్యూ ఇస్తున్న సమయంలో భూప్రకంపనల తీవ్రత 5.8గా నమోదయ్యింది.
ఆ లైవ్ ఇంటర్వ్యూలోనే ఈ భూకంప తీవ్రత గురించి ఆమె మాట్లాడటం విశేషం. భూమి ఊగిపోతున్నట్టు ఉంది. ప్రధాని మాటలు విన్న చానెల్ హోస్ట్ ర్యాన్ బ్రిడ్జ్.. మీరు ఓకేనా.. షో కంటిన్యూ చేస్తారా అని ఆమె అనుమతి అడగారు. నాకేం ఇబ్బంది లేదు. నేను బలమైన పునాది ఉన్న నిర్మాణంలో ఉన్నాను. వీధి లైట్ల కింద లేను.. అంటూ షో కంటిన్యూ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇంటర్వ్యూ కొనసాగింది. భూ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయి.. అని కూడా అదే షోలో ప్రధాని తెలిపారు.
వెల్లింగ్టన్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిన్ అనే పట్టణంలో ఈ భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
█▓▒░Asiannewshub®░▒▓█#Watch | #NewZealand Prime Minister #JacindaArdern was unflustered by an #earthquake that struck the capital #Wellington while she was doing a live TV interview, and calmly continued with the program. pic.twitter.com/EMsa17k09S
— Asian News Hub (@AsianNewsHub) May 25, 2020
348855 793363You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals goes along with along along with your internet website. 366207