వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది. దీంతో వీరి పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. 9 మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులకు కొంత సమాచారం అందింది. వీరంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్టు రిపోర్టులో తేలింది. సంచలనం రేపిన ఈ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కుటుంబం అంతా బావిలో దూకడానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
వీరికి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా వీరికి మత్తు మందు ఇచ్చి బావిలో పడేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో ఏడుగురి సెల్ ఫోన్స్ మిస్సవడం పెద్ద మిస్టరీగా మారింది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు యాకూబ్, బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ ను పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ పెద్ద మక్సూద్ కుమార్తె బుస్రాతో యాకుబ్ కు సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనకు ముందు వీరి మధ్య ఫోన్ కాల్ సంభాషణను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
567360 147497I also recommend HubPages itself, and Squidoo, which is related. 241341
657237 505751I appreciate your function , thanks for all the informative blog posts. 819539
848467 984358Echt tolle Seite. Rubbish bin eigentlich nur per Zufall hier gelandet, aber ich bin jetzt schon complete von der tremendous Seite beeindruckt. Gratuliere dazu!! Viel Erfolg noch durch der sehr guten Home-page mein Freund. 655647