దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు పయనమవుతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక, ఆకలికి తట్టుకోలేక చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వలస కూలీ ఆకలికి తట్టుకోలేక చేసిన పని వారి దయనీయ పరిస్థతికి అద్దం పడుతోంది.
ఢిల్లీ – రాజస్థాన్ ను కలిపూ జైపూర్ హైవే పై ఓ వలస కార్మికుడు ఆకలికి తట్టుకోలేక పోయాడు. తాను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుక్కను చూసాడు. ఆకలికి ఆగలేక వెంటనే ఆ కుక్కను తినడం మొదలుపెట్టాడు. ఆకలికి తట్టుకోలేక కూలీ చేస్తున్న పనిని చూసిన అటుగా వెళ్తున్న ఓ కారు యజమాని ఆగి అడిగాడు. ఎందుకిలా అని ప్రశ్నించిన అతనికి ఆకలికి తట్టుకోలేక పోయాను అని వివరణ ఇచ్చాడు. ఈ విషాద సంఘటనకు చలించి పోయిన కారు యజమాని తన దగ్గరున్న కొంత ఆహారాన్ని ఆ కూలీకి అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇటువంటి దయనీయ పరిస్థితులు జరగడం విచారకరం.
156116 246594Delighted for you to discovered this internet site write-up, My group is shopping a lot more often than not regarding this. This can be at this moment definitely what I are already seeking and I own book-marked this specific web site online far too, Ill often be maintain returning soon enough to look at on your special weblog post. 129874
804090 36336I entirely agree! I came more than from google and am looking to subscribe. Where is your RSS feed? 690667
336170 831275What is your most noted accomplishment. They could want excellent listeners rather than excellent talkers. 242143