కరోనా వైరస్ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ మారటోరియం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రెండో దఫా మారటోరియంని ఆర్బీఐ ప్రకటించింది. దాంతో, టెర్మ్ లోన్లకు సంబంధించి వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ఆగస్ట్ వరకు మూడు నెలల మారటోరియంని ఆర్బీఐ ప్రకటించడంతో.. మొత్తంగా ఆరు నెలల మారటోరియం లభించినట్లయ్యింది.
అయితే, మారటోరియంని వినియోగించుకోవడం వల్ల వినియోగదారులకు కలిగే ఉపశమనం పెద్దగా ఏమీ లేదనీ, ఒక్కసారిగా బాదుడు తపప్పదనీ, దానికి తోడు వడ్డీల బాదుడూ వుంటుందనీ ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రధానంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగానే భావించాల్సి వుంటుంది. అసలే, ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా దెబ్బతినేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనుమరుగైపోతున్నాయి.
కార్పొరేట్ సంస్థలూ తమ ఉద్యోగుల్ని పెద్దయెత్తున తొలగిస్తున్న విషయాల్ని చూస్తున్నాయి. ‘బ్యాంకులు కూడా నడవాలి.. అంటే, వినియోగదారులకు బాదుడు తప్పదు..’ అనే వాదన ఓ పక్క ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నా, ప్రపంచం కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని చూస్తున్న దరిమిలా, ఆర్థిక సమస్యలు సగటు మనిషిని బలవన్మరణాల వైపు నడిపించకూడదంటే.. కేంద్రమే జోక్యం చేసుకుని తగిన వెసులుబాట్లు కల్పించాలన్నది వారి నుంచే వస్తోన్న ఇంకో సూచన.
ఇప్పటికే కరోనా దెబ్బకి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి దేశవ్యాప్తంగా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్న వార్తల్ని నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని పబ్లిసిటీ స్టంట్గానే ఆర్థిక రంగ నిపుణులు తేల్చి చెబుతున్న వేళ, మారటోరియం సహా అనేక విషయాల్లో కేంద్రం ఇంకోసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మంచిదేమో.!
553841 448180Hi there, i just thought i would publish and now let you know your sites style is genuinely smudged within the K-Melon browser. Anyhow preserve inside the very excellent work. 634618
270991 955910New York Travel Tips […]below youll uncover the link to some web sites that we think you ought to visit[…] 868239