Switch to English

20 లక్షల కోట్ల ప్యాకేజీ: కేంద్రాన్ని కడిగి పారేసిన కేసీఆర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

‘కరోనా రూపంలో పెను విపత్తు వచ్చి పడితే.. రాష్ట్రాలు ఆర్థిక విపత్తుని ఎదుర్కొనే క్రమంలో కేంద్రం సాయం చేయాల్సింది పోయి.. రాష్ట్రాల్ని బిచ్చగాళ్ళలా చూస్తారా.?’ అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసిన కేసీఆర్‌, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీన్‌ జోన్లలో కార్యకలాపాలకు అనుమతినిస్తున్నామనీ, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిబంధనల్ని కరినంగా అమలు చేస్తామని చెప్పారు.

‘బతికుంటే బలుసాకు తినొచ్చని నేనే చెప్పాను. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలంటే, కొన్ని వెసులుబాట్లు తప్పవు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటూనే, అత్యవసరమైన పనులు చక్కబెట్టుకోవాలి’ అని కేసీఆర్‌ సూచించారు. ‘హెలికాప్టర్‌ మనీ’ అంటూ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కేసీఆర్‌, ఆ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం పట్ల పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ పేరుతో ప్రకటించడం, దాన్ని ఐదు దఫాలుగా ‘వివరిస్తూ’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా ముందుకొచ్చి చెప్పడం తెలిసిన సంగతులే. కాగా, రాష్ట్రాలు అప్పు చేసుకునేందుకు పెద్ద మనసుతో అనుమతివ్వాల్సిన కేంద్రం, షరతులు విధించడాన్ని కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు.

‘మా ఆలోచనలు మాకున్నాయ్‌.. మీరు ఇచ్చే ముష్టి మాకు అవసరం లేదు’ అని నిర్మొహమాటంగా కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ‘కేంద్రంతో సఖ్యతగానే వుంటాం.. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే.. ఖచ్చితంగా పోరాడతాం’ అని కేసీఆర్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

గతంలో, ప్రధాని నరేంద్ర మోడీని దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని నినదించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేంద్రం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందిస్తాం.. కేంద్రం సరిగ్గా వ్యవహరించకపోతే నిలదీస్తాం.. అని కేసీఆర్‌ గతంలోనూ చెప్పారు.. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి కేంద్రాన్ని నిలదీస్తున్నారు కూడా.

ఇదిలా వుంటే, రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైద్రాబాద్‌ నగరంలో మాత్రం సిటీ బస్సులకు అనుమతి లేదు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రధాన బస్‌ స్టేషన్‌ అయిన ఎంజీబీఎస్‌కి వచ్చే అవకాశం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...