Switch to English

20 లక్షల కోట్ల ప్యాకేజీ: కేంద్రాన్ని కడిగి పారేసిన కేసీఆర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘కరోనా రూపంలో పెను విపత్తు వచ్చి పడితే.. రాష్ట్రాలు ఆర్థిక విపత్తుని ఎదుర్కొనే క్రమంలో కేంద్రం సాయం చేయాల్సింది పోయి.. రాష్ట్రాల్ని బిచ్చగాళ్ళలా చూస్తారా.?’ అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసిన కేసీఆర్‌, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీన్‌ జోన్లలో కార్యకలాపాలకు అనుమతినిస్తున్నామనీ, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిబంధనల్ని కరినంగా అమలు చేస్తామని చెప్పారు.

‘బతికుంటే బలుసాకు తినొచ్చని నేనే చెప్పాను. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలంటే, కొన్ని వెసులుబాట్లు తప్పవు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటూనే, అత్యవసరమైన పనులు చక్కబెట్టుకోవాలి’ అని కేసీఆర్‌ సూచించారు. ‘హెలికాప్టర్‌ మనీ’ అంటూ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కేసీఆర్‌, ఆ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం పట్ల పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ పేరుతో ప్రకటించడం, దాన్ని ఐదు దఫాలుగా ‘వివరిస్తూ’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా ముందుకొచ్చి చెప్పడం తెలిసిన సంగతులే. కాగా, రాష్ట్రాలు అప్పు చేసుకునేందుకు పెద్ద మనసుతో అనుమతివ్వాల్సిన కేంద్రం, షరతులు విధించడాన్ని కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు.

‘మా ఆలోచనలు మాకున్నాయ్‌.. మీరు ఇచ్చే ముష్టి మాకు అవసరం లేదు’ అని నిర్మొహమాటంగా కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ‘కేంద్రంతో సఖ్యతగానే వుంటాం.. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే.. ఖచ్చితంగా పోరాడతాం’ అని కేసీఆర్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

గతంలో, ప్రధాని నరేంద్ర మోడీని దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని నినదించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేంద్రం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందిస్తాం.. కేంద్రం సరిగ్గా వ్యవహరించకపోతే నిలదీస్తాం.. అని కేసీఆర్‌ గతంలోనూ చెప్పారు.. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి కేంద్రాన్ని నిలదీస్తున్నారు కూడా.

ఇదిలా వుంటే, రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైద్రాబాద్‌ నగరంలో మాత్రం సిటీ బస్సులకు అనుమతి లేదు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రధాన బస్‌ స్టేషన్‌ అయిన ఎంజీబీఎస్‌కి వచ్చే అవకాశం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...