డాక్టర్ సుధాకర్, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేశాడు. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో అధికార పార్టీ నేతలే మాస్క్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారనీ, డాక్టర్లకు అవసరమైన మేర మాస్క్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ వార్తల్లోకెక్కాడీ డాక్టర్ సుధాకర్. ఈ క్రమంలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.
చివరికి ప్రభుత్వం, డాక్టర్ని సస్పెండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ అండదండలతో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశాడన్నది డాక్టర్ సుధాకర్పై అధికార పార్టీ వాదన. ఇక, ఇప్పుడీ డాక్టర్ తప్పతాగి, నడి రోడ్డు మీద బూతులు మాట్లాడుతూ చిక్కాడు. ఈ బూతు పురాణం మామూలుగా లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని పట్టుకుని అనరాని బూతు మాటలు అన్నాడు. దాంతో, వైసీపీ అభిమానులకు ఒళ్ళు మండింది. కొందరు చితకొట్టేశారు. పలువురు పోలీసులు కూడా డాక్టర్ని చితక్కొట్టినట్లు తెలుస్తోంది.
వైద్యుడి ప్రవర్తన సంగతి పక్కన పెడితే, అతన్ని తాళ్ళతో కట్టేసిన వైనం, చితక్కొట్టిన వైనం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఓ కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోపక్క, తప్పతాగి రోడ్డు మీద నానా యాగీ చేస్తున్న డాక్టర్పై కేసు నమోదు చేశామనీ, ఆసుపత్రికి తరలించి ఆల్కహాల్ మోతాదు ఎంత వుందో పరీక్షిస్తున్నామనీ పోలీస్ అధికారులు తెలిపారు.
నిత్యం వాహనాలతో రద్దీగా వుండే రహదారిపై డాక్టర్ న్యూసెన్స్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. మరోపక్క, దళిత డాక్టర్పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
ఇక్కడ ‘కులం’ ప్రస్తావన ఎందుకు వచ్చిందోగానీ, మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ వాడిన భాషని ఎవరూ హర్షించరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రిని బూతులు తిడితే, ముఖ్యమంత్రిని అభిమానించే వైసీపీ కార్యకర్తలు ఊరుకుంటారా.? అయితే, ఇందులో పోలీసులు ఎందుకు లారీలు ఝుళిపించాల్సి వచ్చింది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమో, ఈ వ్యవహారం ఎన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో, ఎంత రాజకీయ దుమారం రేపుతుందో వేచి చూడాల్సిందే.
నర్సీపట్నం ఆస్పత్రిలో కనీస అవసరాలు లేవని #YSJagan ప్రభుత్వాన్ని ప్రశ్నించి,సస్పెండ్ కి గురైన డాక్టర్ సుధాకర్ పోర్ట్ ఆస్పత్రి దగ్గర అర్ధనగ్నంగా నిరసన చేయగా,అక్కడి పోలీసులు రెండు చేతుల్ని కట్టేసి,కొట్టుకుంటూ తీసుకెళ్లారు#NarsipatnamDoctor #JusticeForSudhakar #janasena #TDP #YSRCP pic.twitter.com/oN5EU9zBLJ
— TeluguBulletin.com (@TeluguBulletin) May 16, 2020