విశాఖపట్నంలోని గోపాలపురం – ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో వున్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవడం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తోందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వెంటనే విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా వుండకుండా, ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వుండాలి. కరినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నేతలకు సూచించాను’ అని జనసేనాని పేర్కొన్నారు.
కాగా, జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జనసేన నేత సందీప్, బాధితులకు మాస్క్లను పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బాధితుల్ని తమ వాహనాల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఇదిలా వుంటే, విశాఖకు స్వయంగా వెళ్ళేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యంమంత్రి వైఎస్ జగన్ కూడా బాధితుల్ని పరామర్శించేందుకు విశాఖకు పయనమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం విశాఖకు వెళ్ళనున్నారు.
ఏదిఏమైనా, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడి చేయడం, ఆ తర్వాత కాలుష్య కారక పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతులివ్వడం, పరిశ్రమల్లో భద్రతను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.
957190 351844What may you suggest in regards to your submit that you just made some days in the past? Any certain? 998995