Switch to English

గుడి వద్దు, బడి వద్దు.. ‘మద్యం’ మాత్రమే ముద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

గుడికి వెళితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. బడికి వెళితే విద్యనభ్యసించవచ్చు. కానీ, ఇవేవీ ప్రస్తుతానికి వద్దు. ఎందుకంటే, కరోనా వైరస్‌ అనే మహమ్మారి పొంచి వుంది.. ఎవరు బయటకొచ్చినా కాటేయడానికి సిద్ధంగా వుంది.! మరి, మద్యం షాపుల దగ్గర ‘క్యూ’ కడితే కరోనా వైరస్‌ సోకదా.?

హిందూ దేవాలయాలు, ముస్లింల మసీదులు, క్రిస్టియన్ల చర్చిలు.. ఇవేవీ నలభై రోజులుగా భక్తులకు అందుబాటులో లేవు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికే కరోనా ఎఫెక్ట్‌ పడింది. కానీ, మద్యం షాపుల్ని బార్లా తెరిచేశారు. ఇదే కదా అసలు సిసలు మహమ్మారి అంటే.

కరోనా వైరస్‌ దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. నిన్న ఒక్క రోజే మద్యం మహమ్మారి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగానే తేటతెల్లమవుతోంది. అయినా, ఎందుకు ప్రభుత్వాలు మద్యం దుకాణాలపై ‘మోజు’ ప్రదర్శిస్తున్నాయట.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. ప్రజారోగ్యం కంటే, ప్రభుత్వాలకు ‘మద్యం’ ద్వారా వచ్చే ఆదాయం మీదనే ‘మోజు’ ఎక్కువ.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు, కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా వున్న ఢిల్లీ కావొచ్చు, మరో రాష్ట్రం కావొచ్చు.. ఇదే బాటలో నడుస్తున్నాయి. అసలు, మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రం ఎలా అనుమతులు ఇవ్వగలిగింది.? ఏ నైతికత.? ఏ ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరిచాయోగానీ.. నలభై రోజులకు పైగా ప్రశాంతంగా వున్న భారతావని, ఇప్పుడు మద్యం కారణంగా మళ్ళీ సరికొత్త అలజడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేలా వుంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, నిన్న ఒక్కరోజే మద్యం అమ్మకాల ద్వారా మొత్తం 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలతో దాదాపు సమానమిది. లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, మద్యం బాబులు ఈ స్థాయిలో మద్యాన్ని ఎలా కొనుగోలు చేసినట్లు.? జనం ఛస్తే ఛావనీ.. ఖజానా నిండుతోందని ప్రభుత్వాలు సంబరపడితే, ఇక సంక్షేమ పథకాలు ఎందుకు.?

నెలకి వెయ్యి రూపాయల కరోనా సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం ధరలేమో పెంచేసింది. అంటే, ఇలా ఇచ్చి.. అలా లాక్కోవడమే కదా.! అదేమని ప్రశ్నిస్తే, ‘మేమేమన్నా బలవంతంగా గుంజుకుంటున్నామా.? తాగడం మానెయ్యమని చెప్పండి.. మద్య నియంత్రణలో భాగంగానే రేట్లు పెంచాం..’ అని అధికార వైసీపీ చెబుతోంది. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో 40 రోజులకు పైగా రాష్ట్రంలో అనధికారిక మద్య నిషేధం అమల్లో వున్నట్లే. ప్రభుత్వం ఆలోచన మద్య నిషేధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్న దరిమిలా, అనుకోకుండా కలిసొచ్చిన మద్య నిషేధానికి ప్రభుత్వమే తూట్లు పొడవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...