Switch to English

అటు కరోనా.. ఇటు రాజకీయాలు: ఏపీ ఇంతేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ను అటు కరోనా.. ఇటు రాజకీయాలు నిత్యం పట్టి పీటిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఆరు పదులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అదే స్థాయిలో రాజకీయాలూ హీటెక్కుతున్నాయి. కష్టకాలంలో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం మాట అటుంచితే.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ప్రజల్లో పలచన అవుతున్నారు. కరోనాను అరికట్టడంలో అధికార పక్షం విఫలమైందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తోంది.

తాజాగా అధికార పక్షం అసమర్థత వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని, పాలన చేతకాకపోతే చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకోవాలని.. లేదంటే నెలరోజులపాటు చంద్రబాబుకు పాలన అప్పగించాలని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా టీడీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తోంది తామేనని చెబుతున్నారు. ఈ విషయంలో తమది రికార్డు అని పేర్కొంటూ చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో ముందుంటున్నారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు విపక్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ.. తాజాగా సొంత పార్టీ నేతల తీరుతోనూ ఇబ్బంది పడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, అసలు ఎస్పీని తాను లెక్కల్లోకి తీసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై వెంటనే కేసు ఎత్తివేయాలంటూ నల్లపురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.

అప్పటికి పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పంపించినా.. కేసు మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, కలెక్టర్ టార్గెట్ గా ఆయన సవాల్ చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారింది. అధికార పార్టీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలకు నల్లపురెడ్డి ఎపిసోడ్ ఊతమిచ్చేలా ఉందనే వైసీపీలోనే చర్చ సాగుతోంది. తమ డ్యూటీ చేస్తున్న అధికారులపై ఆయన అలా సవాల్ చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ రాజకీయాలు మాని, ప్రజల క్షేమం కోసం కృషి చేయాలని సోషల్ మీడియాలో పలువురు సూచనలు చేస్తున్నారు. అధికార, విపక్షాలు ఇకనైనా ఆ దిశగా దృష్టి పెడతాయా లేదా అన్నది చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...