Switch to English

అటు కరోనా.. ఇటు రాజకీయాలు: ఏపీ ఇంతేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ను అటు కరోనా.. ఇటు రాజకీయాలు నిత్యం పట్టి పీటిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఆరు పదులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అదే స్థాయిలో రాజకీయాలూ హీటెక్కుతున్నాయి. కష్టకాలంలో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం మాట అటుంచితే.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ప్రజల్లో పలచన అవుతున్నారు. కరోనాను అరికట్టడంలో అధికార పక్షం విఫలమైందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తోంది.

తాజాగా అధికార పక్షం అసమర్థత వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని, పాలన చేతకాకపోతే చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకోవాలని.. లేదంటే నెలరోజులపాటు చంద్రబాబుకు పాలన అప్పగించాలని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా టీడీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తోంది తామేనని చెబుతున్నారు. ఈ విషయంలో తమది రికార్డు అని పేర్కొంటూ చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో ముందుంటున్నారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు విపక్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ.. తాజాగా సొంత పార్టీ నేతల తీరుతోనూ ఇబ్బంది పడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, అసలు ఎస్పీని తాను లెక్కల్లోకి తీసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై వెంటనే కేసు ఎత్తివేయాలంటూ నల్లపురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.

అప్పటికి పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పంపించినా.. కేసు మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, కలెక్టర్ టార్గెట్ గా ఆయన సవాల్ చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారింది. అధికార పార్టీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలకు నల్లపురెడ్డి ఎపిసోడ్ ఊతమిచ్చేలా ఉందనే వైసీపీలోనే చర్చ సాగుతోంది. తమ డ్యూటీ చేస్తున్న అధికారులపై ఆయన అలా సవాల్ చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ రాజకీయాలు మాని, ప్రజల క్షేమం కోసం కృషి చేయాలని సోషల్ మీడియాలో పలువురు సూచనలు చేస్తున్నారు. అధికార, విపక్షాలు ఇకనైనా ఆ దిశగా దృష్టి పెడతాయా లేదా అన్నది చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....