ఆంధ్రప్రదేశ్ ను అటు కరోనా.. ఇటు రాజకీయాలు నిత్యం పట్టి పీటిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఆరు పదులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అదే స్థాయిలో రాజకీయాలూ హీటెక్కుతున్నాయి. కష్టకాలంలో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం మాట అటుంచితే.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ప్రజల్లో పలచన అవుతున్నారు. కరోనాను అరికట్టడంలో అధికార పక్షం విఫలమైందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తోంది.
తాజాగా అధికార పక్షం అసమర్థత వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని, పాలన చేతకాకపోతే చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకోవాలని.. లేదంటే నెలరోజులపాటు చంద్రబాబుకు పాలన అప్పగించాలని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా టీడీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తోంది తామేనని చెబుతున్నారు. ఈ విషయంలో తమది రికార్డు అని పేర్కొంటూ చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు.
ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో ముందుంటున్నారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు విపక్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ.. తాజాగా సొంత పార్టీ నేతల తీరుతోనూ ఇబ్బంది పడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, అసలు ఎస్పీని తాను లెక్కల్లోకి తీసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై వెంటనే కేసు ఎత్తివేయాలంటూ నల్లపురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
అప్పటికి పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పంపించినా.. కేసు మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, కలెక్టర్ టార్గెట్ గా ఆయన సవాల్ చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారింది. అధికార పార్టీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలకు నల్లపురెడ్డి ఎపిసోడ్ ఊతమిచ్చేలా ఉందనే వైసీపీలోనే చర్చ సాగుతోంది. తమ డ్యూటీ చేస్తున్న అధికారులపై ఆయన అలా సవాల్ చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ రాజకీయాలు మాని, ప్రజల క్షేమం కోసం కృషి చేయాలని సోషల్ మీడియాలో పలువురు సూచనలు చేస్తున్నారు. అధికార, విపక్షాలు ఇకనైనా ఆ దిశగా దృష్టి పెడతాయా లేదా అన్నది చూడాలి.
178280 338892As I web site possessor I think the articles here is extremely wonderful, regards for your efforts. 360824
888118 820975There is noticeably a whole lot to realize about this. I suppose you created certain nice points in attributes also. 791861
296707 943249This really is such a great post, and was thinking a lot exactly the same myself. An additional fantastic update. 89865
980437 884072Some actually fascinating info , properly written and loosely user genial . 832716
336871 38996a great deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 21133
848917 779404Um, take into consideration adding pictures or much more spacing to your weblog entries to break up their chunky look. 437579