Switch to English

లాక్ డౌన్ పొడిగింపుపై మోదీ మదిలో ఏముంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. దాదాపు 40 రోజులుగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ దేశంలో కేసుల సంఖ్య తగ్గలేదు. ఇప్పటివరకు 33వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1074 మంది చనిపోయారు. నిజానికి ఈ లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య తగ్గుతుందని భావించారు. కానీ అలా జరగకుండా రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ గడువు సమీపిస్తోంది. మే 3తో లాక్ డౌన్ ముగియనుంది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా లేక ఆంక్షలతో సడలిస్తారా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని లాక్ డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. కానీ అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు ప్రజల ప్రాణాలూ రెండూ తమకు ముఖ్యమేనని చెబుతున్న కేంద్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రధాని మోదీ మరోసారి మేరీ ప్యారీ దేశ్ వాసియో.. అంటూ ఎప్పుడు టీవీలో కనిపిస్తారా అని దేశం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. లాక్ డౌన్ పై అందరి అభిప్రాయాలూ తీసుకున్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.

లాక్ డౌన్ పొడిగింపుపై హాంగ్ కాంగ్ మోడల్ ను అనుసరించే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనాకు పొరుగున ఉన్న హాంకాంగ్ లో జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 15 నాటికి వంద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. లాక్ డౌన్ విధించకుండానే హాంకాంగ్ ఈ వైరస్ పై చక్కని నియంత్రణ సాధించింది. ఇందుకోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి.

ముందుగా వైరస్ సోకినవారిని ఎక్కడికక్కడ వెతికి పట్టుకుని మరీ క్వారంటైన్ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసింది. జనం బయట ఎక్కువగా తిరగకుండా ఆంక్షలు విధించింది. జనం సమూహాలుగా ఉండకుండా నిరోధించింది. మరోవైపు హాంకాంగ్ పౌరులు కూడా ప్రభుత్వానికి సహకరించారు. దీంతో కరోనా వైరస్ అక్కడ తీవ్రంగా వ్యాప్తి చెందలేదు. దీంతో ఇప్పుడు మన దేశంలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసి ఆ మోడల్ అనుసరిస్తారనే చర్చ సాగుతుంది. కానీ భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది వర్కవుట్ కాదని అంటున్నారు.

హాంకాంగ్ జనాభా 75 లక్షలు మాత్రమే. అలాంటిచోట్ల లాక్ డౌన్ లేకపోయినా కఠినమైన ఆంక్షల ద్వారా వైరస్ ను అదుపులోకి తెచ్చే వీలుంటుంది. కానీ 130 కోట్ల జనాభా కలిగిన మనదేశంలో అది అంత సత్ఫలితం ఇవ్వదని అంటున్నారు. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చి, మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించడం ఖాయమని అంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...