కరోనా వైరస్ కేసులు భారతేదశంలో క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య వెయ్యి దాటేసింది. రోజురోజుకీ పెరుగుతున్న కేసుల సంగతెలా వున్నా, కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడం కాస్తంత ఊరటనిచ్చే విషయం.
21 రోజుల లాక్డౌన్, భారతదేశానికి చాలా మేలు చేస్తుందనీ, పెను ప్రమాదం నుంచి తప్పిస్తుందనీ, లాక్ డౌన్ ప్రకటించిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆయా రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ని పక్కాగా అమలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నా, మొత్తంగా చూసినప్పుడు కరోనా విషయంలో భారతదేశం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లే చెప్పుకోవాలి.
తెలంగాణలో ఇప్పటికే కేసుల సంఖ్య 70కి చేరుకుంది. అదే సమయంలో, కరోనా వైరస్ బారిన పడ్డవారు క్రమంగా కోలుకుంటున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ పరిస్థితి మెరుగవుతోంది. అనుమానితులందర్నీ దాదాపుగా ‘గ్రిల్’ చేయడంతో (క్వారంటీన్కి తరలించడంతో) పరిస్థితి అదుపులోకి వస్తోందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. మార్చి 31 తర్వాత చాలామందికి విముక్తి లభిస్తుందనీ, ఇందులో క్వారంటీన్ వ్యక్తులు కూడా వుంటారని ఆయా ప్రభుత్వాలు చెబుతుండడం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ఏప్రిల్ 7 నాటికే తెలంగాణకి కరోనా నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకో వారం రోజుల్లో.. అంటే, ఏప్రిల్ 14 నాటికి భారతదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య చాలావరకూ తగ్గిపోవచ్చట. అదే జరిగితే, ఏప్రిల్ 14 తర్వాత ఏ క్షణాన అయినా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం వుంటుంది.
ఒకవేళ కొనసాగినా, ఇంకో వారం.. మహా అయితే మరో వారం మాత్రమే లాక్ డౌన్ వుండే అవకాశాలున్నాయి. అదే జరిగితే, అంతకన్నా కావాల్సిందేముంది.? ముందే మేల్కోవడంతో కరోనా ముప్పు నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడిందన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట.
656515 281984The very good intreguing articles maintain me coming back here time and time once again. thank you so a lot. 707113