ప్రపంచానికి కరోనా వైరస్ అంటించించిన చైనా క్రమంగా కోలుకుంటోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండగా.. దాదాపు రెండు నెలల తర్వాత చైనాలో లాక్ డౌన్ ఎత్తివేశారు. దీంతో జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వారు మళ్లీ యధావిధిగా తమ అలవాట్లకు పనిచెప్పారు. పిల్లులు, కుక్కలు, కప్పలు, పాములు.. ఇలా అన్ని రకాల జీవులను లాగించడం మొదలుపెట్టేశారు.
అసలు వూహాన్ లోని ఈ జంతువులను అమ్మే మార్కెట్ వల్లే కరోనా వైరస్ మొదలైందనే కథనాలు బోలెడు వచ్చాయి. ప్రధానంగా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లే ఈ వైరస్ సోకిందని, అక్కడి నుంచి మొత్తం ప్రపంచానికే పాకిందనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టించడంతో వుహాన్ లోని మార్కెట్ ను చైనా అధికారులు కొంతకాలం మూసివేశారు. దీంతో అక్కడి జనం కూడా జంతువులను తినడం దాదాపుగా మానేశారు.
తాజాగా అక్కడ లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ వుహాన్ మార్కెట్ తెరుచుకుంది. మళ్లీ యథావిధిగా అన్ని రకాల జంతువులను అమ్మకానికి పెట్టేశారు. దాదాపు రెండున్నర నెలలుగా నాన్ వెజ్ లేకపోవడంతో చైనీయులు కూడా ఒక్కసారిగా మార్కెట్ కు ఎగబడ్డారు. ఎవరికి కావాల్సిన జంతువులను వారు కొనుక్కుని తీసుకువెళ్తున్నారు. ఇంత జరిగినా వారు తమ ఆహార అలవాట్లను ఏమాత్రం మార్చుకోకపోవడం గమనార్హం.
పైగా ఈ వైరస్ పీడ తమకు విరగడ అయిపోయిందని, ఇక తాము హాయిగా అన్నీ తినొచ్చని పలువురు చైనీయులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం మొత్తం ఏమైపోయినా.. వారికి మాత్రం ఆ జంతువులు ఉంటే చాలు.
791623 485389Dead pent subject matter, thanks for entropy. 641335
364351 470167Some genuinely nice stuff on this internet internet site , I it. 704783
65370 451148Man you legend. return see my site, you need to get pleasure from it. 607597
543556 279578Most what i read online is trash and copy paste but i think you offer something different. Maintain it like this. 731308