దేశాన్ని కరోనా భయపెడుతున్నది. కరోనా భయం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 288 కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో దేశం అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నది. ఎండలు పెరుగుతున్నా పాజిటివ్ కేసులు కూడా అధికంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
రేపు ప్రజలెవరూ బయటకు రావొద్దని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు జనత కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రకటించింది. జనత కర్ఫ్యూ విధించడానికి కారణం ఏంటి అన్నది కూడా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. 14 గంటల పాటు ప్రజలు బయటకు రాకుండా ఉంటె, బయట ఉన్న వైరస్ చైన్ ను బ్రేక్ చెయ్యొచ్చని, అంతేకాకుండా, కరోనా పాజిటివ్ బారిన పడిన వ్యక్తులను చికిత్స చేసేందుకు అవకాశం దొరుకుతుందని ప్రభుత్వం చెప్తున్నది. ఈ విధంగానే ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోంది.
ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి, రేపటిరోజున రాష్ట్రంలో పూర్తిగా బస్సులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రేపు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బస్సులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, దూరప్రాంతానికి వెళ్లే బస్సులను కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనతా కర్ఫ్యూ అని చెప్తున్నా… చూస్తుంటే కర్ఫ్యూ సమయంలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉంటుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టు అర్ధం అవుతున్నది.
263632 210738dress shops that offer discounts are extremely common in our spot and i always shop at them,. 994516
700222 673747Why didnt I consider this? I hear exactly what youre saying and Im so happy that I came across your weblog. You genuinely know what youre talking about, and you made me feel like I really should learn far more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 29941