Switch to English

పీవీ బాటే సో బెటరా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కి, ప్రభుత్వ పెద్దలకు మధ్య ఎడతెగని పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలనే వాయిదా వేయడంతో మొదలైన ఈ రగడ.. అనంతరం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో మరింత ముదిరిపోయింది. తొలుత ఆ లేఖ ఎవరు రాసిందనే అంశంపై సందిగ్ధం రాగా.. ఎస్ఈసీ సైతం తాను ఈ లేఖ రాయలేదని చెప్పినట్టు వార్తలొచ్చాయి. కానీ కేంద్ర హోంశాఖకు ఆ లేఖ అందడం.. రమేశ్ కు భద్రత పెంచడం వంటివి జరిగాయి.

ఈ నేపథ్యంలో ఆ లేఖ మీడియాకు ఎలా లీకైందనే అంశంపై సర్కారు దర్యాప్తు జరిపిస్తోంది. మొత్తానికి ఎస్ఈసీ వల్ల తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న సర్కారు పెద్దలు.. ఆయనకు ఎలా చెక్ చెప్పాలనే అంశంపై మేధోమథనం జరిపారు. రూల్స్ పై అపార అవగాహన ఉన్న మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి తో సీఎం జగన్ సంప్రదింపులు జరిపారు.

ఇంకా నిమ్మగడ్డ పదవీకాలం ఏడాది పైగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను తొలగించే అవకాశాలను పరిశీలించినట్టు సమాచారం. అయితే, అంత సులభం కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హైకోర్టు జడ్జితో సమానమైన అవకాశాలు కలిగిన ఎస్ఈసీని అభిశంసించాలంటే అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. శాసనసభలో ఇది సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ, మండలి దగ్గరకు వచ్చేసరికి మళ్లీ మొదటికి వస్తుంది.

మండలి రద్దు అంశం పార్లమెంటులో పెండింగ్ లో ఉన్నందున అప్పటివరకు అది పనిచేస్తున్నట్టే లెక్క. అందువల్ల అభిశంసన అనేది ప్రస్తుతానికి కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ విషయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనుసరించిన మార్గమే ఇప్పుడు కూడా సరైనదని సర్కారు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

అప్పట్లో శేషన్ చాలా నిక్కచ్చిగా పనిచేశారు. తాను ఏది చెబితే అదే జరిగేది. ఇది పీవీకి తలనొప్పిగా మారింది. అయితే, ఆయన మైనార్టీ ప్రభుత్వం కావడంతో శేషన్ ను అభిశంసించడం వీలుపడలేదు. దీంతో శేషన్ అధికారాలకు కత్తెర వేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. ఇకపై ఎలాంటి నిర్ణయమైనా మెజార్టీ అభిప్రాయం మేరకే తీసుకోవాలని స్పష్టంచేయడంతో శేషన్ అధికారాలకు కత్తెర పడినట్టయింది.

ప్రస్తుతం ఏపీలో ఎస్ఈసీ రమేశ్ విషయంలో కూడా ఇలాగే ముందుకెళ్లాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలని భావిస్తున్నారు. అప్పుడు ముగ్గురిలో ఇద్దరు ఎటువైపు మొగ్గితే అదే నిర్ణయం అమలవుతుంది. దీంతో ప్రభుత్వం అనుకున్నదే చేసుకునే వీలుంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...