తెలంగాణలో తెరాస పార్టీకి ఎదురులేకుండా ఏకచక్రాధిపత్యం వహిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు హవాను కొనసాగించాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణాం ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. రెండు పార్టీలు ప్రజలకోసం పోరాటం చేయలేదు.
అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణను ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని, ప్రత్యేక వాదంతో పార్టీని స్థాపించి 13 ఏళ్లపాటు పోరాటం చేసిన తెరాస పార్టీకి ఓటు వేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ అప్పటి నుంచి బలంగా పాతుకుపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఒకవిధంగా చెప్పాలి అంటే 2014వ సంవత్సరంలో తెరాస పార్టీకి పెద్దగా మెజారిటీ లేదు. బొటాబొటీన విజయం సాధించింది.
తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు తెరాస పార్టీలోకి జంప్ కావడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. ఈ స్థితి నుంచి బయటకు రావాలి అంటే అంత సులభమైన విషయం కాదు. తెలంగాణ పార్టీలు తెరాస కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజలనుంచి వ్యతిరేకత వస్తోంది తప్పించి అనుకూలంగా ఉండటం లేదు.
ఎంత పెద్ద పార్టీ అయినా ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే తెరాస పార్టీ చేస్తున్న పరిపాలన పెద్దగా గొప్పగా ఏమి లేదు. కానీ, గొప్పగా లేదు అని బలంగా చెప్పే నాయకుడు ప్రతిపక్షాలలో లేరు. అదే వచ్చిన సమస్య. ఈ సమయంలో పోరాటం చేయడం కంటే కూడా తెరాస చేస్తున్న పాలనపై దృష్టి పెట్టి, ఆ పార్టీ ఏవైనా తప్పులు చేస్తుందా, చేస్తే ఆ తప్పులు ఏంటి వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఆలోచించడం మంచిది.
10752 30965Awesome blog, Im going to spend a lot more time researching this subject 29589
108083 939127You produced some decent points there. I looked on-line for any problem and discovered most individuals will go in conjunction with with your website. 121306
255638 795857Hi my friend! I want to say that this post is awesome, nice written and incorporate almost all significant infos. Id like to see more posts like this . 12939