Switch to English

3 రాజధానులు.. వైఎస్‌ జగన్‌కి ‘ముప్పు’ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేవు. ఆ మాటకొస్తే, భారతదేశానికి ఢిల్లీ మాత్రమే ఏకైక రాజధాని. అలాంటిది, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఎందుకు.? ఈ మాత్రం ఇంగితం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి.

‘మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి..’ అంటూ వైసీపీ నేతలు పైకి చెబుతున్నా, తెరవెనుకాల వ్యవహారం వేరేలా వుంది. నిజానికి వైసీపీలో చాలామందికి మూడు రాజధానుల ప్రతిపాదన నచ్చలేదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే వైసీపీకి చెందిన నేతలు చెప్పుకొస్తున్నారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మూడు రాజధానుల పట్ల తన అసంతృప్తిని ఓ సందర్భంలో వెల్లడించారు. తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌, మూడు రాజధానులపై అసంతృప్తిని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికే తీసుకెళ్ళాడని వసంత నాగేశ్వరావు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, తానిప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నానని వసంత నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం.

అమరావతిని శాసన రాజధానిగా మార్చుతూ, విశాఖకి అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ హోదాని ఇచ్చి, కర్నూలుని జ్యుడీషియల్‌ రాజధానిని చేయాలన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన. అయితే, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆ మధ్య ‘అమరావతిలో శాసన సభ వుండాలా.? వద్దా.?’ అంటూ బెదిరింపులకు దిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

పరిపాలన అంటే.. మరీ చులకనైపోయింది అధికార పక్షానికి. లేకపోతే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తోన్న ఎమ్మెల్యే రోజా, అమరావతి ప్రాంత ప్రజల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా ‘శాసన సభ వుండలా.? వద్దా.?’ అని ప్రశ్నించడమేంటి.? ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. పార్టీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలకి విలువ లేకుండా పోయింది. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు తమకు ఇష్టం వున్నా లేకున్నా భరించాల్సిన దుస్థితి ఏర్పడింది.

అయితే, ఎక్కువకాలం ఇలా నేతల నోళ్ళను కట్టేయడం సాధ్యం కాదు ఏ రాజకీయ పార్టీకి అయినా. ఒక్కసారి, పార్టీ అధినేత పట్ల వ్యతిరేక గళం బయటకొస్తే.. ఇక, ఆ తర్వాత అదో ఉప్పెనగా మారి, అధికార పార్టీ కొంపు ముంచేయడం ఖాయం. ఆ రోజు ఎంతో దూరం లేదని ప్రతిపక్షం భావిస్తోంది. ప్రతిపక్షమే కాదు, వైసీపీలోనూ ఈ అభిప్రాయం వుందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అందరికీ.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...