అఖిల్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈయన తన నాల్గవ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ను ఖరారు చేశారు. సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అఖిల్ 5వ సినిమాకు ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. తదుపరి చిత్రాన్ని ఏ సినిమాలో చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.
అఖిల్ 5వ చిత్రంకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆ తర్వాత తమిళ దర్శకుడి పేరు కూడా ప్రస్థావనకు వచ్చింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. స్టైలిష్ దర్శకుడిగా పేరున్న సురేందర్ రెడ్డికి మంచి సక్సెస్లు ఉన్నాయి. సైరా చిత్రంతో గత ఏడాది వచ్చిన సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈయనతో చేసే అవకాశం ఉందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే నాగార్జునను కలిసిన సురేందర్ రెడ్డి స్టోరీ లైన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అఖిల్ 5వ సినిమాను నాగార్జున నిర్మించాలని భావిస్తున్నాడు. అందుకే పలువురు హీరోలను క్యూలో పెట్టాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఆ క్యూలో చేరిపోయాడు. అతి త్వరలోనే అఖిల్ 5 దర్శకుడిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అఖిల్ 5 చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
482060 921208Id have to speak to you here. Which isnt something Which i do! I love to reading a post that ought to get folks to feel. Also, thank you for permitting me to comment! 861951