ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులోనే కాకుండా తమిళం మరియు కన్నడంలో కూడా ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. మూడు భాషల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక షాకింగ్ సంఘటనను ఎదుర్కొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలో ఈ అమ్మడు తన ఇంట్లో ఉండగా కొందరు అభిమానులు కలిసేందుకు వెళ్లారట. వారిని కలిసి సెల్ఫీ ఇచ్చేందుకు రష్మిక బయటకు వచ్చింది. ఆ సమయంలోనే ఆమెతో సెల్ఫీ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీ కోసం పోటీ పడుతున్న సమయంలో ఒకరు రష్మికకు చాలా దగ్గరగా వెళ్లినట్లు వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా తీసుకుని ఏకంగా ముద్దు పెట్టి అక్కడనుండి పారిపోయాడట.
అభిమాని చేసిన పనికి అక్కడున్న వారు అంతా షాక్ అయ్యారు. ఆమె బాడీ గార్డ్స్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపు అక్కడి నుండి తుర్రుమన్నాడు. సెల్ఫీ పేరుతో ఇలాంటివి ఈ మద్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే మంత్రి కడియంను దొంగిలించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ముద్దు పెట్టేశారు. అందుకే సెల్ఫీ ఇచ్చేందుకే సెలబ్రెటీలు భయపడుతున్నారు.
559390 614614I truly enjoy looking by means of on this internet web site , it holds superb content . 849952
363313 34586Thanks for all your efforts that you have put in this. really intriguing details. 357148