Switch to English

బీజేపీతో పొత్తు కోసం.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమొచ్చింది.? మొన్న ప్రధాని నరేంద్ర మోడీతోనూ, నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోనూ వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరుసగా భేటీ అవడం వెనుక రాజకీయ కోణాల్ని విస్మరించలేం.

ఈ మధ్యకాలంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా వైఎస్‌ జగన్‌కి దొరకడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, అనూహ్యంగా బీజేపీ పెద్దలు (కేంద్ర ప్రభుత్వ పెద్దలే అయినా..) వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు నరేంద్ర మోడీ, ఇంకొకరు అమిత్‌ షా.

‘మేం కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగానే వున్నాం..’ అంటూ సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం విశేషమే మరి. రాజధాని అమరావతి విషయంలో మొదట బురద చల్లింది ఈయనగారే. అమరావతిని స్మశానంగా అభివర్ణించిన బొత్స, రాష్ట్రంలో బీభత్సమైన రాజకీయ అలజడిని రేపారు. అదే బొత్స ద్వారా, బీజేపీతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడుతున్న విషయాన్ని బయటపెట్టించేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

అయితే, బీజేపీ అందుకు సుముఖంగా వుందా.? లేదా.? అన్నదే చర్చ ఇక్కడ. ‘మాకు వైసీపీతో కలవాల్సిన అవసరం లేదు’ అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఢిల్లీలో రాజకీయం ఇంకోలా వుంది. ‘మాతో కలవాలంటే కలవొచ్చు.. కానీ, మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చబోం..’ అని బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ అధినేతకు తేల్చి చెప్పిందట.

‘దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు కేంద్రానికి షాకిస్తున్నాయి.. ముందు ముందు బీజేపీకి రాజ్యసభలో ఎంపీలు అవసరమవుతారు.. ఆ లెక్కన మా అవసరం బీజేపీకి తప్పక ఏర్పడుతుంది’ అని వైసీపీ భావిస్తోంది. కానీ, ‘అవసరమైతే, ఇతర పార్టీల నుంచి ఎంపీల్ని లాక్కుంటాం.. అంతే తప్ప, ఎవరి గొంతెమ్మ కోర్కెల్నీ తీర్చే పరిస్థితే లేదు’ అని బీజేపీ అగ్రనాయకత్వం లీకులు పంపుతుండడం గమనార్హం.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు.. ఇలా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన, చేయాల్సిన విషయాలు చాలానే వున్నాయి. కానీ, వ్యవహారం మాత్రం ఇంకో కోణంలో నడుస్తోంది. ఏమో, ముందు ముందు ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...