Switch to English

బీజేపీతో పొత్తు కోసం.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమొచ్చింది.? మొన్న ప్రధాని నరేంద్ర మోడీతోనూ, నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోనూ వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరుసగా భేటీ అవడం వెనుక రాజకీయ కోణాల్ని విస్మరించలేం.

ఈ మధ్యకాలంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా వైఎస్‌ జగన్‌కి దొరకడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, అనూహ్యంగా బీజేపీ పెద్దలు (కేంద్ర ప్రభుత్వ పెద్దలే అయినా..) వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు నరేంద్ర మోడీ, ఇంకొకరు అమిత్‌ షా.

‘మేం కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగానే వున్నాం..’ అంటూ సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం విశేషమే మరి. రాజధాని అమరావతి విషయంలో మొదట బురద చల్లింది ఈయనగారే. అమరావతిని స్మశానంగా అభివర్ణించిన బొత్స, రాష్ట్రంలో బీభత్సమైన రాజకీయ అలజడిని రేపారు. అదే బొత్స ద్వారా, బీజేపీతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడుతున్న విషయాన్ని బయటపెట్టించేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

అయితే, బీజేపీ అందుకు సుముఖంగా వుందా.? లేదా.? అన్నదే చర్చ ఇక్కడ. ‘మాకు వైసీపీతో కలవాల్సిన అవసరం లేదు’ అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఢిల్లీలో రాజకీయం ఇంకోలా వుంది. ‘మాతో కలవాలంటే కలవొచ్చు.. కానీ, మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చబోం..’ అని బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ అధినేతకు తేల్చి చెప్పిందట.

‘దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు కేంద్రానికి షాకిస్తున్నాయి.. ముందు ముందు బీజేపీకి రాజ్యసభలో ఎంపీలు అవసరమవుతారు.. ఆ లెక్కన మా అవసరం బీజేపీకి తప్పక ఏర్పడుతుంది’ అని వైసీపీ భావిస్తోంది. కానీ, ‘అవసరమైతే, ఇతర పార్టీల నుంచి ఎంపీల్ని లాక్కుంటాం.. అంతే తప్ప, ఎవరి గొంతెమ్మ కోర్కెల్నీ తీర్చే పరిస్థితే లేదు’ అని బీజేపీ అగ్రనాయకత్వం లీకులు పంపుతుండడం గమనార్హం.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు.. ఇలా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన, చేయాల్సిన విషయాలు చాలానే వున్నాయి. కానీ, వ్యవహారం మాత్రం ఇంకో కోణంలో నడుస్తోంది. ఏమో, ముందు ముందు ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...