Switch to English

నవయుగ ‘దెబ్బ’కి జగన్‌ సర్కార్‌ ‘అబ్బా’ అనాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

అందరూ ఊహించిందే జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘మొండితనం’ ప్రదర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని పణంగా పెట్టి, తన రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారాయన. లేకపోతే, ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్ళడమేంటి.? ఈ క్రమంలో ఇప్పటికే తప్పించిన నవయుగ సంస్థకీ అవకాశం కల్పిస్తామనడమేంటి.? చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అడ్డగోలు అవినీతి జరిగిందన్నది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆరోపణ.

ఈ నేపథ్యంలోనే రివర్స్‌ టెండరింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. కేంద్రం, ఈ రివర్స్‌ టెండరింగ్‌ వ్యవహారంపై ఓ పక్క ఆగ్రహం వ్యక్తం చేస్తోంటే, ఇంకోపక్క నవయుగ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. ఇలాంటి వ్యవహారాలు కోర్టుల్లో అంత త్వరగా తేలవు. పైగా, ఓ సంస్థకి కాంట్రాక్ట్‌ లభించిందంటే.. దానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పక్కాగా వుంటాయి. ఒప్పందాల్ని ఎవరు అతిక్రమించినా పరిణామాలు తీవ్రంగా వుంటాయి.

ఈ విషయమై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆ హెచ్చరికల్ని లైట్‌ తీసుకున్నారు. మొండిగా ముందడుగు వేశారు. ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారంలోనూ జగన్‌ ఇదే వైఖరి కొనసాగించారు. కానీ, ఆ కూల్చివేత తర్వాత, అక్కడే వున్న అక్రమ కట్టడాల్లో దేనివైపూ ఇప్పటిదాకా జగన్‌ సర్కార్‌ కన్నెత్తి చూడలేకపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. రివర్స్‌ టెండరింగ్‌ అంశంపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని కేంద్రం ఇప్పటికే నివేదిక కోరింది.

ఇంకోపక్క నవయుగ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దరిమిలా, ముందు ముందు వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రేపో మాపో కేంద్రం నుంచి వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి ‘పోలవరం’ షాక్‌ తగలబోతోందన్నది తాజా ఖబర్‌. ఆ షాక్‌ విషయమై వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు ముందుగానే జగన్‌ని అప్రమత్తం చేసినా, జగన్‌ ఎవరి మాటా వినడంలేదట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...