అందరూ ఊహించిందే జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ‘మొండితనం’ ప్రదర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని పణంగా పెట్టి, తన రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారాయన. లేకపోతే, ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్కి వెళ్ళడమేంటి.? ఈ క్రమంలో ఇప్పటికే తప్పించిన నవయుగ సంస్థకీ అవకాశం కల్పిస్తామనడమేంటి.? చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అడ్డగోలు అవినీతి జరిగిందన్నది వైఎస్ జగన్ సర్కార్ ఆరోపణ.
ఈ నేపథ్యంలోనే రివర్స్ టెండరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కేంద్రం, ఈ రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై ఓ పక్క ఆగ్రహం వ్యక్తం చేస్తోంటే, ఇంకోపక్క నవయుగ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. ఇలాంటి వ్యవహారాలు కోర్టుల్లో అంత త్వరగా తేలవు. పైగా, ఓ సంస్థకి కాంట్రాక్ట్ లభించిందంటే.. దానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పక్కాగా వుంటాయి. ఒప్పందాల్ని ఎవరు అతిక్రమించినా పరిణామాలు తీవ్రంగా వుంటాయి.
ఈ విషయమై వైఎస్ జగన్ సర్కార్ని చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ హెచ్చరికల్ని లైట్ తీసుకున్నారు. మొండిగా ముందడుగు వేశారు. ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారంలోనూ జగన్ ఇదే వైఖరి కొనసాగించారు. కానీ, ఆ కూల్చివేత తర్వాత, అక్కడే వున్న అక్రమ కట్టడాల్లో దేనివైపూ ఇప్పటిదాకా జగన్ సర్కార్ కన్నెత్తి చూడలేకపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. రివర్స్ టెండరింగ్ అంశంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కేంద్రం ఇప్పటికే నివేదిక కోరింది.
ఇంకోపక్క నవయుగ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దరిమిలా, ముందు ముందు వైఎస్ జగన్ సర్కార్కి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రేపో మాపో కేంద్రం నుంచి వైఎస్ జగన్ సర్కార్కి ‘పోలవరం’ షాక్ తగలబోతోందన్నది తాజా ఖబర్. ఆ షాక్ విషయమై వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు ముందుగానే జగన్ని అప్రమత్తం చేసినా, జగన్ ఎవరి మాటా వినడంలేదట.
970000 347253I want reading via and I conceive this internet site got some genuinely utilitarian stuff on it! . 231368
857422 330378Extremely instructive and great bodily structure of topic matter, now thats user pleasant (:. 290347