Switch to English

టీడీపీ నెత్తిన ‘నడ్డా’ బాంబు: బీజేపీలోకి ‘ఆ‘ రెడ్డిగారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు.. ఇప్పుడు రాజకీయంగా ఆశ్రయం కరవైనవారందరికీ కమలం పార్టీ కామధేనువులా కనిపిస్తోంది. ఇక తమ పార్టీకి సరైన భవిష్యత్తు లేదని భావించేవారు, అధికార పార్టీలోకి ఎంట్రీ దొరకడం కష్టమైనవారంతా కాషాయం పార్టీ వైపే చూస్తున్నారు.

బీజేపీపై ప్రేమతోనో, ఇంకేదో కారణంతోనో వారు కాషాయ కండువా కప్పుకోవడంలేదు. రాజకీయంగా తమకు ఓ అండ అవసరం అని భావించేవారు వడివడిగా కమలం గూటికి చేరిపోతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలంగాణలో టీటీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు సైతం తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ బీజేపీ జాతీయ కార్యనిర్వహాక అధ్యక్షుడు జేపీ నడ్డా బాంబు పేల్చారు. ఇక ఏపీలోనూ కమలం పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సరైన ఓటు బ్యాంకూ లేదు.. పెద్దగా ప్రభావం చూపే నేతలూ లేరు. అయినా, కొంతమంది నేతలు ఆ పార్టీ వైపు చూడటానికి ప్రధాన కారణం.. తమను తాము రక్షించుకోవడం కోసమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థికపరమైన కేసులు ఉన్న కారణంగానే టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటివారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని పలువురు బహిరంగంగానే అంటున్నారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ వైఖరి కూడా ఉంటోంది. టీడీపీలో ఉన్నంతవరకు వారిపై తీవ్ర విమర్శలు చేసిన కాషాయ పార్టీ నేతలు.. వారు బీజేపీలో చేరగానే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి మాట మార్చేశారు.

ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సాధినేని యామిని సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆమె కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కమలం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఆయన.. అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్ సీఎం కావడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. ఇటు టీడీపీలో ఉండటం వల్ల ఉపయోగం లేదని, అదే సమయంలో వైఎస్సార్ సీపీలోకి వెళ్లే పరిస్థితి అసలే లేదని తేలడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏపీ సీఎం జగన్ నుంచి తనకు ఎలాంటి సమస్యలూ ఎదురుకావనే ఉద్దేశంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...