దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు.. ఇప్పుడు రాజకీయంగా ఆశ్రయం కరవైనవారందరికీ కమలం పార్టీ కామధేనువులా కనిపిస్తోంది. ఇక తమ పార్టీకి సరైన భవిష్యత్తు లేదని భావించేవారు, అధికార పార్టీలోకి ఎంట్రీ దొరకడం కష్టమైనవారంతా కాషాయం పార్టీ వైపే చూస్తున్నారు.
బీజేపీపై ప్రేమతోనో, ఇంకేదో కారణంతోనో వారు కాషాయ కండువా కప్పుకోవడంలేదు. రాజకీయంగా తమకు ఓ అండ అవసరం అని భావించేవారు వడివడిగా కమలం గూటికి చేరిపోతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలంగాణలో టీటీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు సైతం తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ బీజేపీ జాతీయ కార్యనిర్వహాక అధ్యక్షుడు జేపీ నడ్డా బాంబు పేల్చారు. ఇక ఏపీలోనూ కమలం పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సరైన ఓటు బ్యాంకూ లేదు.. పెద్దగా ప్రభావం చూపే నేతలూ లేరు. అయినా, కొంతమంది నేతలు ఆ పార్టీ వైపు చూడటానికి ప్రధాన కారణం.. తమను తాము రక్షించుకోవడం కోసమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థికపరమైన కేసులు ఉన్న కారణంగానే టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటివారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని పలువురు బహిరంగంగానే అంటున్నారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ వైఖరి కూడా ఉంటోంది. టీడీపీలో ఉన్నంతవరకు వారిపై తీవ్ర విమర్శలు చేసిన కాషాయ పార్టీ నేతలు.. వారు బీజేపీలో చేరగానే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి మాట మార్చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సాధినేని యామిని సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆమె కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కమలం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఆయన.. అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్ సీఎం కావడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. ఇటు టీడీపీలో ఉండటం వల్ల ఉపయోగం లేదని, అదే సమయంలో వైఎస్సార్ సీపీలోకి వెళ్లే పరిస్థితి అసలే లేదని తేలడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏపీ సీఎం జగన్ నుంచి తనకు ఎలాంటి సమస్యలూ ఎదురుకావనే ఉద్దేశంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం.
561045 432891I truly prize your work , Excellent post. 309320
454416 667243His or her shape of unrealistic tats were initially threatening. Lindsay utilized gun 1st basic, whereas this girl snuck outside by printer ink dog pen. I used completely certain the all truly on the shade, with the tattoo can be taken from the body shape. make an own temporary tattoo 607653
271833 579867I feel this is finest for you: Soccer, Football, Highlight, Live Streaming 99910
371883 81984Oh my goodness! an amazing post dude. Thank you Even so My business is experiencing dilemma with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 632564
881840 232661I enjoy this internet site, will certainly arrive back. Make confident you carry on writing high quality posts. 632776