Switch to English

టీడీపీ నెత్తిన ‘నడ్డా’ బాంబు: బీజేపీలోకి ‘ఆ‘ రెడ్డిగారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు.. ఇప్పుడు రాజకీయంగా ఆశ్రయం కరవైనవారందరికీ కమలం పార్టీ కామధేనువులా కనిపిస్తోంది. ఇక తమ పార్టీకి సరైన భవిష్యత్తు లేదని భావించేవారు, అధికార పార్టీలోకి ఎంట్రీ దొరకడం కష్టమైనవారంతా కాషాయం పార్టీ వైపే చూస్తున్నారు.

బీజేపీపై ప్రేమతోనో, ఇంకేదో కారణంతోనో వారు కాషాయ కండువా కప్పుకోవడంలేదు. రాజకీయంగా తమకు ఓ అండ అవసరం అని భావించేవారు వడివడిగా కమలం గూటికి చేరిపోతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలంగాణలో టీటీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు సైతం తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ బీజేపీ జాతీయ కార్యనిర్వహాక అధ్యక్షుడు జేపీ నడ్డా బాంబు పేల్చారు. ఇక ఏపీలోనూ కమలం పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సరైన ఓటు బ్యాంకూ లేదు.. పెద్దగా ప్రభావం చూపే నేతలూ లేరు. అయినా, కొంతమంది నేతలు ఆ పార్టీ వైపు చూడటానికి ప్రధాన కారణం.. తమను తాము రక్షించుకోవడం కోసమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థికపరమైన కేసులు ఉన్న కారణంగానే టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటివారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని పలువురు బహిరంగంగానే అంటున్నారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ వైఖరి కూడా ఉంటోంది. టీడీపీలో ఉన్నంతవరకు వారిపై తీవ్ర విమర్శలు చేసిన కాషాయ పార్టీ నేతలు.. వారు బీజేపీలో చేరగానే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి మాట మార్చేశారు.

ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సాధినేని యామిని సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆమె కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కమలం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఆయన.. అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్ సీఎం కావడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. ఇటు టీడీపీలో ఉండటం వల్ల ఉపయోగం లేదని, అదే సమయంలో వైఎస్సార్ సీపీలోకి వెళ్లే పరిస్థితి అసలే లేదని తేలడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏపీ సీఎం జగన్ నుంచి తనకు ఎలాంటి సమస్యలూ ఎదురుకావనే ఉద్దేశంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...