Adipurush Pre Release Event: ‘ఆది పురుష్( Adipurush)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఆ సినిమా హీరోయిన్ కృతి సనన్( Krithi Sanon) వేదికపై సందడి చేసింది. తన క్యూట్ క్యూట్ మాటలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. నేను నా కెరియర్ ని తెలుగులో ప్రారంభించాను. ఇప్పుడు మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడికి వచ్చాను. జానకి దేవి లాంటి స్పెషల్ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం, అదృష్టం కొద్ది మంది నటులకి మాత్రమే వస్తుంది. అందులో నేను ఒక దాన్ని. మీ ప్రేమ వల్లే నాకు ఆ అవకాశం వచ్చింది. థాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్. మనం సినిమాలను ఎంచుకోలేము.. సినిమాలే మనల్ని ఎంచుకుంటాయి. అలా జానకి దేవి పాత్ర నన్ను ఎంచుకుంది. నాకు మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి. జై శ్రీరామ్,” అని అన్నారు.
ఇక ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్( Prabhas) ఎలా ఉంటారని యాంకర్ ప్రదీప్ అడగ్గా..దానికి సమాధానమిస్తూ.. ప్రభాస్ ఎక్కువ మాట్లాడారని విన్నాను.. కానీ అది నిజం కాదు. తాను ఎక్కువగా మాట్లాడతారు. తను నిజంగా డార్లింగ్, స్వీట్ హార్ట్. తను చాలా హాడ్ వర్కర్, స్వీట్ పర్సన్. అలానే ఫుడ్ ని బాగా ఇష్టపడే మనిషి కూడా. షూటింగ్ సమయంలో సీన్లో నటించేటప్పుడు తన కళ్ళలోకి చూస్తే.. శ్రీరాముడు పాత్రని ప్రభాస్ తప్ప మరెవరు చేయలేరేమో అని నాకు అనిపించింది’ అంటూ తన స్పీచ్ ని ముగించింది.
డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ.. “జై శ్రీ రామ్! ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం ‘ఆది పురుష్’ చివరి ట్రైలర్ని చూద్దాం. మళ్లీ నేరుగా సినిమా హాళ్లలో కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భూషణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన తన మాటలతో నన్ను ఎమోషనల్గా మార్చారు. ఈ చిత్రాన్ని పెద్ద కాన్వాస్పైకి తీసుకురావడంలో ఆయనదే కీలక పాత్ర. అందుకు ఆయనకి ధన్యవాదాలు. ప్రభాస్ లేకుండా నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండలేను. అందుకే తను నా డార్లింగ్. ఇది అందరి సినిమా, ఇండియా సినిమా అని చెప్పాలనుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. జూన్ 16న సినిమా హాల్లో కలుద్దాం’ అని అన్నారు.
Peculiar article, exactly what I was looking for.