కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం పరిపాటి. కానీ ప్రతిభే కొలమానంగా చూడాల్సిన క్రీడలకూ ఆ జాడ్యం పాకేసింది. దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశాలనూ అది ప్రభావితం చేస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అర్థంతరంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి కారణం కుల రాజకీయాలే అన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగువాడైన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే తోటి తెలుగువాడికి, తన జిల్లాకే చెందిన రాయుడికి అన్యాయం జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్ కుల రాజకీయాలకు అంబటి బలైపోయాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతం సెలక్షన్ కమిటీ తీరును తప్పబట్టాడు. రాయుడు నిస్సందేహంగా చక్కటి ఆటగాడు. మిడిలార్డర్ లో జట్టుకు బాగా ఉపయోగపడతాడు. అయితే, సెలక్టర్లు మాత్రం విజయ్ శంకర్ వైపు మొగ్గు చూపారు.
‘‘చాంఫియన్స్ ట్రోఫీ తర్వాత నాలుగో నెంబర్ స్థానం కోసం కొంతమందిని పరిశీలించాం. రాయుడికి మరికొన్ని అవకాశాలు కూడా ఇచ్చాం. అయితే త్రీడీతో విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. అతడితో నాలుగో స్థానం భర్తీ చేయాలని నిర్ణయించాం’’ అని వరల్డ్ కప్ జట్టు ఎంపిక సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా నిరాశకు లోనైన రాయుడు.. ఎమ్మెస్కే ప్రసాద్ లక్ష్యంగా వ్యంగ్య ట్వీట్ చేశాడు. ‘‘వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ చేశాను’’ అని ట్విట్టర్లో పేర్కొనడం చివరకు అతడి కెరీర్ కే ఎసరు తెచ్చింది.
దీనిని మనసులో పెట్టుకున్న చీఫ్ సెలక్టర్ ప్రసాద్.. రెండుసార్లు అవకాశం వచ్చినా రాయుడిని ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా నిప్పులు చెరుగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్.. కాపు సామాజికవర్గానికి చెందిన రాయుడిని అణగదొక్కే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఆయన స్వార్థ ప్రయోజనాలు, కుల రాజకీయాల కోసం దేశ పరువునే ఫణంగా పెడతారా అని దుయ్యబడుతున్నారు.
రాయుడిని కాదని ఆయన ఎంపిక చేసిన త్రీడీ ఆటగాడు విజయ్ శంకర్ ఏ మేరకు రాణించాడో అందరూ చూశారు. ధావన్ గాయంతో వైదొలగడంతో అవకాశం వస్తుందని భావించిన రాయుడికి నిరాశే ఎదురైంది. తర్వాత విజయ్ శంకర్ గాయంతో తప్పుకోవడంతో అప్పడైనా తనకు చోటు గ్యారెంటీ అనుకున్నాడు. కానీ రెండుసార్లూ అతడికి అవకాశం రాలేదు. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ని పిలిపించారు కానీ రాయుడి పేరుని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇదంతా ప్రసాద్ కుట్ర రాజకీయ ఫలితమేనని విమర్శలు వస్తున్నాయి.
బీసీసీఐ వెంటనే ఆయన్ను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆరు టెస్టులు, 17 వన్డేల్లో 237 పరుగులు మాత్రమే చేసిన ఆయన సెలక్టర్ కావడం క్రికెట్ ప్రపంచం చేసుకున్న దురదృష్టం అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీ కుల రాజకీయాలతో దేశానికి చేటు తేవొద్దని పలువురు కోరుతున్నారు. కాగా, ఎమ్మెస్కే ప్రసాద్, రాయుడు ఇద్దరికీ గుంటూరు జిల్లానే కావడం గమనార్హం.
435760 173302What host are you the usage of? Can I am getting your associate link for your host? I desire my website loaded up as quickly as yours lol 700589
525770 349923I like this blog so significantly, saved to bookmarks . 276651
156518 557243Yay google is my world beater aided me to uncover this outstanding internet site! . 396954
744257 485216Nice post. I be taught 1 thing more challenging on completely different blogs everyday. It will all the time be stimulating to learn content material from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net blog. Thanks for sharing. 776734