Switch to English

క్రికెట్ కూ కులం.. అంబటి గుడ్ బైకి అదే కారణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం పరిపాటి. కానీ ప్రతిభే కొలమానంగా చూడాల్సిన క్రీడలకూ ఆ జాడ్యం పాకేసింది. దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశాలనూ అది ప్రభావితం చేస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అర్థంతరంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి కారణం కుల రాజకీయాలే అన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగువాడైన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే తోటి తెలుగువాడికి, తన జిల్లాకే చెందిన రాయుడికి అన్యాయం జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్ కుల రాజకీయాలకు అంబటి బలైపోయాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతం సెలక్షన్ కమిటీ తీరును తప్పబట్టాడు. రాయుడు నిస్సందేహంగా చక్కటి ఆటగాడు. మిడిలార్డర్ లో జట్టుకు బాగా ఉపయోగపడతాడు. అయితే, సెలక్టర్లు మాత్రం విజయ్ శంకర్ వైపు మొగ్గు చూపారు.

‘‘చాంఫియన్స్ ట్రోఫీ తర్వాత నాలుగో నెంబర్ స్థానం కోసం కొంతమందిని పరిశీలించాం. రాయుడికి మరికొన్ని అవకాశాలు కూడా ఇచ్చాం. అయితే త్రీడీతో విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. అతడితో నాలుగో స్థానం భర్తీ చేయాలని నిర్ణయించాం’’ అని వరల్డ్ కప్ జట్టు ఎంపిక సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా నిరాశకు లోనైన రాయుడు.. ఎమ్మెస్కే ప్రసాద్ లక్ష్యంగా వ్యంగ్య ట్వీట్ చేశాడు. ‘‘వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ చేశాను’’ అని ట్విట్టర్లో పేర్కొనడం చివరకు అతడి కెరీర్ కే ఎసరు తెచ్చింది.

దీనిని మనసులో పెట్టుకున్న చీఫ్ సెలక్టర్ ప్రసాద్.. రెండుసార్లు అవకాశం వచ్చినా రాయుడిని ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా నిప్పులు చెరుగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్.. కాపు సామాజికవర్గానికి చెందిన రాయుడిని అణగదొక్కే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఆయన స్వార్థ ప్రయోజనాలు, కుల రాజకీయాల కోసం దేశ పరువునే ఫణంగా పెడతారా అని దుయ్యబడుతున్నారు.

రాయుడిని కాదని ఆయన ఎంపిక చేసిన త్రీడీ ఆటగాడు విజయ్ శంకర్ ఏ మేరకు రాణించాడో అందరూ చూశారు. ధావన్ గాయంతో వైదొలగడంతో అవకాశం వస్తుందని భావించిన రాయుడికి నిరాశే ఎదురైంది. తర్వాత విజయ్ శంకర్ గాయంతో తప్పుకోవడంతో అప్పడైనా తనకు చోటు గ్యారెంటీ అనుకున్నాడు. కానీ రెండుసార్లూ అతడికి అవకాశం రాలేదు. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ని పిలిపించారు కానీ రాయుడి పేరుని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇదంతా ప్రసాద్ కుట్ర రాజకీయ ఫలితమేనని విమర్శలు వస్తున్నాయి.

బీసీసీఐ వెంటనే ఆయన్ను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆరు టెస్టులు, 17 వన్డేల్లో 237 పరుగులు మాత్రమే చేసిన ఆయన సెలక్టర్ కావడం క్రికెట్ ప్రపంచం చేసుకున్న దురదృష్టం అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీ కుల రాజకీయాలతో దేశానికి చేటు తేవొద్దని పలువురు కోరుతున్నారు. కాగా, ఎమ్మెస్కే ప్రసాద్, రాయుడు ఇద్దరికీ గుంటూరు జిల్లానే కావడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...