Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది.

వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ.! సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందాయనకి. కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్.! అయినాగానీ, వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి కేసు విచారణ ముందుకు కదలడంలేదు.

ఎన్నికల నేపథ్యంలో ఈ హత్య కేసు అప్పట్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం కోసం వాడుకోవడానికి ఉపయోగపడింది. ‘నారాసుర రక్త చరిత్ర’ అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే, ‘అబ్బాయ్ కల్డ్ బాబాయ్’ అంటూ టీడీపీ పొలిటికల్ యాగీ చేసింది.

ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు బాబాయ్ హత్యకేసుకు సంబంధించి. ఈ కేసులో ఎన్నో మలుపులు.. కానీ, దోషులెవరన్నది తేలడంలేదు.

ఒకే ఒక్క మహిళ.. ఆమె న్యాయం కోసం పోరాడుతోంది. ఆమె ఎవరో కాదు, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఆమెను వెంటేసుకుని 2019 ఎన్నికల సమయంలో రాజకీయం చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఆమెకు అండగా నిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు దారుణ హత్య జరిగి వివేకానందరెడ్డి చనిపోతే, గుండె పోటు.. అంటూ సాక్షి మీడియాలో ఎలా వార్త వచ్చింది.? వైసీపీ నేతలు ఎలా చెప్పగలిగారు.? అన్నదానిపై వైఎస్ జగన్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

ఇక, తన హయాంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించి చంద్రబాబు చిత్ర విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తున్నారు. ఈ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై స్పందిస్తూ, ‘జగన్ రెడ్డీ నీ తలకాయ్ ఎక్కడ పెట్టుకుంటావ్.?’ అని ప్రశ్నించేశారు చంద్రబాబు.

నిజమే కావొచ్చు, ఈ విషయంలో వైఎస్ జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. అదే సమయంలో, చంద్రబాబు సంగతేంటి.? ఆ హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే కదా.?

ఇద్దరూ ఇద్దరే.! 60‌-40 బంధం.. చివరికి హత్యా రాజకీయాల్లో కూడానా.? చంద్రబాబు, వైఎస్ జగన్.. ఈ ఇద్దరి మధ్యా అవినాభావ సంబంధం ఏంటన్నది ఎలా బయటపడుతుంది.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...