తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్, ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది ఐటీ అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగియగా.. మరికొన్ని చోట్ల నేడు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘మల్లారెడ్డి విద్యాసంస్థలు ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తూ.. నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించాం. నగదు రియల్ ఎస్టేట్ తోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రికి వెచ్చిస్తున్నారు. స్థిరాస్తులను వాస్తవ విలువకు తక్కువగా చూపార’ని అధికారులు అన్నారు.
దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. ‘అన్ని అనుమతులతోనే ఆసుపత్రులు, కళాశాలలు నిర్వహిస్తున్నాం. ఆస్తుల వివరాలు అధికారులకు అందజేశాం. దాడులతో మాకు ఇబ్బంది లేదు. నేడు దాడులు ముగియచ్చ’ని అన్నారు.
224806 114294Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres lots of individuals that I believe would really enjoy your content. Please let me know. Thanks 939949
968388 12248Very good design and style and great topic matter, extremely little else we want : D. 511670