కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్ధినులు ఒకొక్కరుగా కళ్లు తిరిగి పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. 20 రోజుల క్రితం ఓ విద్యార్ధినితో మొదలైన ఈ సమస్య క్రమక్రమంగా పెరుగడం ఆందోళన రేకెత్తిస్తోంది. వీరంతా కళ్లు తిరిగి పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు.
నిన్న రాత్రి 9,10 తరగతి చదువుతున్న విద్యార్ధినుల కళ్లు తిరిగిపడిపోగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేడు ప్రత్యేక తరగతుల కోసం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధినులు ఏడుగురు ఇలానే కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే వీరిని స్థానిక పీహెచ్ సీకి తరలించి చికిత్స అందించారు.
అనంతరం వైద్యాధికారులు రెండు ఆంబులెన్సులు ఏర్పాటు చేసి విద్యార్ధినులకు కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్పందించి ఘటనకు కారణాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేయనున్నారు. మరోపక్క విద్యార్ధినుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.
644891 573933This is a very good common sense post. Extremely useful to 1 who is just locating the resouces about this part. It will surely aid educate me. 161564
868740 112519Hello there! I could have sworn Ive been to this blog before but soon after reading via some with the post I realized its new to me. Anyhow, Im definitely pleased I identified it and Ill be book-marking and checking back often! 506186