రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ హాజరు అయ్యారు. ఆ సందర్భంగా రోజా మాట్లాడుతూ తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేరుపై ఒక స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు.
స్మృతివనంలో కృష్ణంరాజు కి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానుల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. కృష్ణంరాజు గారు రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన అందరికీ ఇష్టమైన వ్యక్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరం అన్నారు.
వైకాపా ప్రభుత్వం కృష్ణంరాజు పేరుతో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం మంచిదే.. కానీ ఈ పేరుతో రెబల్ స్టార్ యొక్క అభిమానులను వైకాపా ఆకర్షించే ప్రయత్నం చేస్తుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏ ఉద్దేశంతో చేసిన కూడా కృష్ణంరాజు పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం అనేది మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు రెబల్ స్టార్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
305266 425719I dont normally check out these kinds of sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was certainly a bit excited as nicely. Thanks for giving me a big smile for the day 366405